పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


గయ్యముసేయ నానతిని గైకొని దీవెన లంది ద్రోణుని
నెయ్యపు మామశల్యుఁ గృపునింగని వీడ్కొనివచ్చెఁ గ్రమ్మఱన్. 20

క.చిందమ్ములమోఁతలు మి,
న్నంది యెపఁగ భీష్ముదండు లాలపువెడ్కం
గ్రందుగ నడచెను బయిపయి
ముందఱఁబాండునికొమాళ్ళమూఁకలమీఁద౯. 21

సీ. నొగలెక్కి కృష్ణుండు తగుమాడ్కి నిగుడంగఁ
దెల్ల నివ్వారముల్ తేజరిల్ల
జేజే లొసంగిన చిందంబు నొత్తుచు
నరదఁబు పైఁ గ్రీడి యరుగుదెంచి
యిరువాఁగుఁజూచి తానెంతయు మదిలోన
నక్కటికము పుట్టియయినవారి
వేయఁజేతులురాక విల్లునునమ్ములుఁ
దేరనుబడవై చి దిగులుతోఁపఁ

గూలఁబడినఁజూచి గొబ్బునవెన్నుండు,
పొడిఁగఱపి పోరఁబగఱనొంచి
గెలుపుఁగొంట యేలకలకెల్లఁ దగనని,
మదికనాటఁజెప్పి మఱఁదినపుడు. 22

క. దురమునకుంబురికొల్పినఁ,
బరువడిన సందియము వాసివాసి యెసంగం
గురిసెను నమ్ములవానల,
గరువంబఱి పగఱపౌఁజు గలఁగంబడఁగన్. 23

సీ.మార్తుర మొత్తముల్ మార్కొనిపోరిన
సందడికయ్యంబు జరగెనపుడు