పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము


హితువుగఁ బురికొల్పినందగ
నతఁ డప్పుడె ద్రుపదుపట్టి నందఱుఁజూడ౯. 16

క. పడవాలుగాఁగ నొనరించి
వెడలి కురుక్షేత్రమనేడి పేరిట చోట౯
విడించి మూఁక నెల్లను
గడు సంతోషమున నుండెఁగల నొనరింన్ ప. 17

సీ. వెన్నుండు నడిచిన వెంటనె యచ్చట
దుర్యోధనుండును దోదు సూప
వచ్చిన ఱేఁడుల హెచ్చరికను జేసి
గమికి నెల్లను మొనగానిఁ గాఁగ
భీష్ముని నొనరించి ప్రేరించి మొనలును
దమ్ములు నెయ్యరుఁ దవిలి రాఁగఁ
గదలి కురుక్షేత్ర మదనుతప్పక చేరి
విడియించి దడముల వేఱుచోటఁ
 
గర్ణుఁ డంతకుమున్నె పెక్కండ్రు వినఁగ,
భీష్ముఁడుసుఱులువిడిచినపిదపఁగాని
తాను బోరికి రానని తగని బాస,
చేసికొనె మాటపట్టింపు చేతవీట. 18

క. దళవాయి యైనభీష్ముండు,
కలనికిఁ బురికొల్పి మొనలఁ గడుబీరమున౯
దలపడఁ బంచెను జోదుల,
కెలమియుమగఁటిమిచలంబునెపకంబెసఁగ౯. 19


ఉ. అయ్యెడఁ బాండుపెద్దకొడు కందఱు నందరుదందఁ గాల్నడన్
జయ్యన భీష్ముపాలికిఁ గనం జని వేలువుటేటిపట్టిచే