పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


యనిన పిమ్మట భీముండు నతనినమ్ము
లవల ద్రోవది మదిఁజెప్పిరతనితోడ. 9

ఉ. ఆవలఁగృఅష్ణుఁడేగి మరియాదమెయిన్ ధృతరాష్ట్రుఁ జూచి యా
క్రేవల ద్రోణునిం గృవునిఁ గేల్లవమోడిచి పల్కరించి య
త్తావున నున్న భీష్మునిని దద్దయుఁ గూరిమి గారవించి య
చ్చో వెరవారఁ గొల్వునను జూపఱ డెందములుం గరంగఁగన్. 10

చ. చను వును బల్మిఁ జూపి పలుచందములం దగఁజెప్పి యంతతోఁ
దనియక యొద్దనున్న జడదారులచేతను జేతనైన లా
గునఁ బలికించి యెందునను గోరిక చేకుఱకున్న నోలగం
బున ధృతరాష్ట్రుపట్టిపయిఁ బూనినంక్క బల్కు లాడినన్. 11

క.వడిఁ గర్ణుని దుశ్శాసను
చెడుగఱవులు నమ్మి కృష్ణుఁజేడ్పడఁ గట్టం
గడఁగిన దుర్యోధనుఁ డెద
జడియఁగఁ దనరూపు చూపి చనెఁ గృష్ణుండు౯. 12

ఆ.అట్లు కొలువు విడుచునప్పుడు వెన్నుండు
బవరమరుగుదెంచెఁ బదిలమనుచుఁ
బలికి వచ్చి కుంతి బస కేగి మాటాడి
విదురు నింటఁగడిచి వెడలెవీడు. 13

వ. అట్లు బయల్వెడలి కొన్నినాళ్లకు. 14

చ. విరటుని యూరుచేరి యట వేవుర ముందర గొంతిపట్టితో
       సరగున నంతయుం దెలిపి జా గొనరింపక గొప్పదండుతో
        దురమున కాయితం బగుట తొల్తటి కర్జముగాఁగఁ జెప్పి య
      బ్బురముగ వాఁడిసూది మొన మోపినయంతయు నేలనీయఁగన్. 15

క. ధృతరాష్ట్రుని కొడు కొప్పమి
      కతలుగ నెఱిఁగించి మిగులఁ గయ్యంబుకు౯