పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

<poem>క.మొదలుం దుదియు నెఱుంగక,

పదిలముగా నెపుడు నుండి పాడుగొనంబుల్
వెదకినను లేక మేలే,
యొదవించుచు జగము లేలుచుండెడి వేల్పా.

వ.శౌనకుండు లోనుగాఁగల జడదారిఱేండ్ల కానూతుం డిట్లనియె.

క.విరటుఁడు గృఘ్ణఁడు మొదలగు,

దొరలెల్లను గూడి యుండి దుర్యొధను తుం
టరితనము నుగ్గడించుచు,
నరుమగ నొకరాయబారి నచటికిఁబంప౯.

తే.అందఱును నెంచి యచ్చోటి కరిగి యతఁడు

తెలుపవలసినపలుకులుఁ దెలియఁగఱపి
ద్రుపదు నొజ్జను బంపిరి తొడరి సగము
పుడమి జముపట్టికిని నియ్య నడుగుకొఱకు.
తే. అంత నిట గ్రీడి వెన్ను నియింటిక రిగి
పోరఁ దన తేరు నడపంగఁ గోరుకొనియె
నాడె దుర్యోధనుడువచ్చి నాఁ డెమైన
బంట్లఁ బదివేవురను దానుఁ బడసి చనియె.
క. నేల గల దొరల లోపలఁ
జాలగ దుర్యోధనునకు సాయము చూపం
బాలు పడిరి పెఱవారలు
పోలగ జముపట్టిఁ జేరి పొలిచిరి కడిమి౯
చ. ద్రుపదుని యెజ్జ యేగియటఁ ద్రోవకురా ధ్రృతరాష్ర్ట్రుతోడఁ గొం
త పొసగ మాటలాడి తనదారిని వచ్చిన గ్రుడ్లిఱేడును