పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము


సుబ్రహ్మణ్యము పుస్తకమును విప్పుచు, తుండము వేశదంతమును దోరపుబోజ్జయు యను విఘ్నేశ్వర సవపద్యమును నారంభించి చదువుతుండగా శాస్త్రులందుకొని యా పద్యము కడవఱాకు నయిన తరువాత, 'అంజలిజేసి మ్రొక్కెద మదంబకు ' మొదలుగాగల సరస్వతీ ప్రాధకానమును, పిమ్మట ప్రాంళుపయోదసీలతను భాసితు ' మొదలుగాగల వ్యాసస్తోత్రములను , పిదప మఱికొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను . ఈ లోపల సుబ్రమహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి , అర్జునుడుద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి


 " ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగ నేని గం

గాదిమహా నదీ హీనవదాది మహాగిరిదశాన్ంబు మీ

సాదప యోజనదర్శనము పన్నుగజేయుట జేసి పూర్వసం

పాదితసర్వపాపములు వాఎస్ భృశంబుగ నాకు నచ్యుతా! "


అను పద్యమును జదివెను. అప్పుడు శాస్తుృలు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియు గల్పించి దీఘములు తీయుచు వధముచెప్ప మొదలుపెట్టెను. అర్ధము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకు గట్టియున్న పుడకను జ్రతిలో బట్టుకొని త్రిప్పుచుండెను . అదిచూచి శాస్తుృలు ఉలికిపడి ముక్కుమీద వ్రేలు వైచుకొని పుస్తము చదువు చుండాగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసులవారు దానిమీద గూరుచుందరే' యని దగ్గఱ నున్నవార్రి కావిషయమయిన కధ నొకదానిని జెప్పెను. ఆమాటమీద నందులో నెవ్వరో నడిగినదానికి బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, వారప్పు డామార్గ