పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము


రాజ-వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసిమాపాకములోరావలెను.


సోమ-నాకుస్త్రీపాకముపుచ్చుకోనని నియమము. మీయింటవంటచేయువారు పురుషులేకదా?


రాజ-మాపినతల్లికుమార్తెవంటచేసినది. మాయింటనెప్పుడును స్త్రీలేవంటచేయుదురు.


సోమ-అయ్యా!స్త్రీపాకమేకాకుండనియోగిపాకముకూడ నేనెట్లుపుచ్చుకొందును? కొంచెమత్తెసరుపెట్టించిన నేనువచ్చిదింపుకొనుదును.


సోమ-(కొంచెము సేపనుమానించి)నేనెఱుఁగుదును. మీదిమొదటినుండియుశిష్టసంప్రదాయము-మీతాతగారెంతోకర్మిష్టులు; మీతండ్రిగారుకేవలముబ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు గాని యొకచోట భోజనము చేసినానన్న మఱియొక చోటను గూడనాలాగుననే చేయమందురు. నేనిక్కడభోజునము చేసినమాటనుమీరు రహస్యముగా నుంచవలెను. కార్తికసోమవారము గనుక గోదావరిఁబోయి నిమిషములో స్నానము చేసివచ్చెదను. ఇంతలో వడ్డనకానిండి.


అని పేరయ్య సోమయాజులు కృష్ణాజినమును నారసించుయు నట్టింటఁ బెట్టిగోదావరికిఁ బోయి స్నానము చేసివచ్చి, కృష్ణాజినమునువ చావడిలో క్రిందఁబఱిచి దానిమీఁద దర్భాసనమువేసికొని కూర్చుండి, గోముఖములోఁ జేయి దూర్చి లోపలరుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసుకొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్లమందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును