పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

పద్మమును పద్మముల కిరుపార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రములయిన యాకులును పువ్వులును తీఁగెయును చెక్కఁబడియున్నవి.ఆఁతీగపైని కాళ్లు మోపి ఫలములను ముక్కుతో పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలఉ చిత్రింపబడి యున్నవి.వీధితలుపులకు బలమైన గ్రంధులు చేయఁబడి వానిపయినిసహి మొకవిధ మయిన పుష్పలత మలచఁబడియున్నది.


గుమ్మము దాటిలోపలికి వెళ్ళినతొడనే చావడియుండెను. ఆచవడి కెదురుగా పెద్దకుండు ఒకటియు౦డెను. వర్షము కురియునప్పుడు నాలుగు వైపులనుండియు చూరు నీళ్ళాకుండులోఁబడి వీధీచావడి క్రింద నుండు తూమూగుండ వీధీలోనికి బోవును. ఆకుండుకుత్తరవైపునను దక్షిణపువైపు నను ఒకదానికొకటియెదురుగా రెండు చావళ్ళుండును. అందుదక్షినపుదిక చేరిచావడి. దానిలో వివాహదులయందు తాంబూలములకు పిలిచిన బంధువులును పెద్ద మనుష్యులును సభ చేసి గూర్చుండగా , క్రింద బోగముమేళము జరుగుచుండెను. ఇతరసమయములలో పెద్ద మనుష్యులు చూడ వచ్చినప్పుడును. మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణకాల క్షేపము జరుగునప్పుడు, శిష్యులప్పుడు చదువుకోవచ్చినప్పుడును రాజశేఖరుడుగా రందుకూర్చుందురు.ఆచావడి రెండుప్రక్కలను రెండుగదులు గలవు. ఆచావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్పుడెల్లను సభవారిచెమట లార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండెను. ఆతలుపులకు వెనుక పంచపాళియు,దానివెనుక పలువిధము లయిన పూలమొక్కలతో నేత్రములకు విందుకొలుపు చిన్నదొడ్డి యుండెను. ఆచావడిలో మూడు గొడలకును నిలువె డెత్తునకుపయిని మేకులకు గొప్పపటములు