పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్యరాజా పూర్వదేశయాత్రలు

లగచెట్లకు నిచ్చెనలు వేయు నంతటి హ్రస్వాంగులు పుట్టుదురని చెప్పియు న్నందున నట్టివారిలో నేను ప్రథముఁడనని చెప్పెను, ఇంకొక పురాణ వేత్త తనవ్రేలితో నన్ను కొలిచి వాలఖిల్యాదు లని యొగతెగ మహర్ష లంగుష్ఠమాత్రశరీరు లుందురని పురాణములలోఁ జెప్పియున్నం దున నేను వాలఖిల్యాదులసంతతివాఁడ నని చెప్పెను. ఆట్లు పురాణ మార్గమున మాత్రమేకాక తరువార నలుగురు సిద్దాంతులును జ్యౌతిష మార్గమునకూడ నాలోచించి నేను మనుఝ్యఁడనని యేకవాక్యముగాఁ బలికిరి. క్రొత్తగాఁ బోయినవానికి నీకునారిసిద్దాంతములన్నియు నెట్లు తెలిసినవని కొందఱు