పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

నన్ను మొట్టమొదట మఱ్ఱిచెట్టు క్రింద చూచిన వాఁడు నాలుగేండ్ల ప్రాయముగల బాలుఁడు. బాలుఁడైన హేతువుచేతనే యాపిల్లవాఁడు దిగంబరుఁడుగా నున్నాఁడు గాని యాలంకలోని కాపులందఱును దెస మొలవారు కారు. అక్కడ పెద్దవాండ్రందఱును మనవలెనే తమకు తగిన నస్త్రములనను ధరించుకొందురు. ఆచాలుఁ డాడుకొనుటకయి యూరి వెలుపలనున్న మఱ్ఱిచెట్టునద్దకువచ్చి నన్నుచూచి మూర్చపోయియున్నప్పుడు పసివాఁగుటచేత నన్ను నిర్భయముగా పిల్లికూనవలెతన యింటికిఁ బట్టుకినిపోయి నేను మూర్చతేఱునప్పటికి నన్ను తనతండ్రికి చూపుచుండెను. అతఁడును నన్నాశ్చర్యపడిచూచి మనుష్యరూపమున నంతచిన్న జంతువున్నవార్త యెప్పుడును విననందున,ఇటునంటి యద్భుతవస్తువును జూచి వింతపడి, అంతచిన్నదిగాకిచ్చుట యుక్తమనిభావించి తక్షణమేకొనిపోయి యాతనికి సమర్పించెను. అతఁడును నారూపమును జూచివింతపడి, అంతచిన్నదిగానున్నను మనుష్యరూపమగుటకు సందేహములేదని నిశ్చయించిఅయినను లంకా ద్వీపము జ్యౌతిష భూమియగుట చేత జ్యోతిఝ్యల నిమిత్తము సేవకులను బంపెను. ముహూర్త గ్రథములను జాతకగ్రంథములను, సాముద్రిక గ్రంధములను చేతఁబట్టుకొని కొంచేము సేపటికి నలుగురు సిద్దాంతు లక్కడకువచ్చిరి. అప్పు డతఁడు నన్నా కాలజ్ఞుకుచూపఁగా వారు నేనేజాతి జంతువునో నిర్ధారణము చేయుటకై గ్రహగతులను విచారించియు శ్వాసలు పరీక్షీంచియు శకునములను జూచియు గణనవేయుట కారం భించిరి. ఆజ్యోతిఝ్కలలో నిద్దఱు మంచి పురాణవేత్తలు. మనదేశము నందువలెనే యాదేశమునందును పురాణములున్నవి. వారిలో నొకపురాణ వేత్తకొంచెముసేపాలోచించి యొకచోట కలియుగములో నేల ము