పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

ఖండమునందు బుట్టి, యందులోను ముఖ్యముగా విఱికికండలేని బ్రాహ్మణు కులమునం దుద్భవిణ్చిన నాకు పౌరషము కొఱఁతవడునా? ముమ్మాటికిని పడదు. సమయము వచ్చిన యెడల నేను ప్రాణములను త్రణప్రాయంగా విడువఁగలను. అయినను నేనాదేశములో మృతుఁడ నయ్యెడు పక్షమున నాకు వీరస్వర్గము సిద్ధమేయినను , మీకీ వార్తలు చెప్పి మిమ్మానందింపఁ జేయువారు మఱియొకరు దొరకరని మీమిఁది యవ్యాజాను గ్రహము చేతినే నేను కరస్ధమైన యింద్రుని యర్ధాసనమును రంభా సంభోగమును మానుకొన్నానుగాని మఱియొక కారణ్ముచేతఁగాదు. నానిమిత్తమయి కష్టపడుచున్న ఫాంఢీభంగీగారిని విడిచి క్ర్ర్ర్రతఘ్నఁడనయి స్వార్ధపరత్వముచేత పోవుచునాండననియు మీరనుకొనఁగూడదు.నామూలమున ఫాంఢీ భంగీగారికి విపత్తులు వచ్చిన మాటసత్యమే. ఆయాపదలను దలఁచియే నేను తమ దేశమునుండి వెడలిపోయినయెడల తనపుత్రికకు కష్టములు తొలగునని ఫాండీభంగీగారి మాత నాకామంత్రము నుపదేశించినదిగాని నాయొందలి యొక్క నిర్వ్యాజానుగ్రహము చేతనేకాదు. ఆమాట పోనిండు. నే నాదేశమును విడువ యత్నించుట కింకొక ముఖ్యకారణము కూడఁ గలదు. హిందువులు దేశాటనము చేసి క్రొత్తదేశములను కనిపెట్టువారు కారనియు, నూతనముగా శోధించి చరిత్రములు వ్రాయ సమర్ధులుకారనియు, పశ్చిమ ఖండవాసులు మనమీఁద రెండు నిందలు మోపియునున్నారు. ఈరెండు నిందలను కల్లచేసి మన దేశమునకు ఖ్యాతితెప్పించవలెనన్న సచ్చింతతో నాయమూల్యములైన ప్రాణములు నాపాడుడేశమునకు బలిపెట్టక లేచి పోయినాడను. నేను కనిపెట్టిన యీదేశములను ,నేను నేను వ్రాసియీచరిత్రను , విన్న వారను హిందువులయం దిఁకముందీ రెండు నిందలు నారోపింపిపక నవకాశాము లేనివారయి హిందువు లెంతటికైన సమర్ధులేనియు యెప్పుకొని మనలను వేయి నోళ్ళ శ్లాఘించి