పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశా యాత్రలు

గర్భాఅధానము చేసినను పురుషునకప్పటి కిరివది స్ంవత్సరముల యిడుండవలెను గనుక , సాధారణాముగా పత్నికంటె భర్త నాలుగు సంవత్సరములు పెద్ద వాడుగానుం డవలెను. రెండవ పెండ్లి స్త్రీ కీనియమము లేదు . అప్పుడు భర్త యెంత చిన్న వాడుగానయిన నుండవచ్చును. అయినను పురుషున కిరువది సంవత్సరములు వచ్చువఱకును మాత్రము పునస్సందానము చేయగూడదు. అందుచేత పురుషులెదిగి శాపురమునకు వచ్చు వ ఱకు స్త్రీలిష్టమున్న యెడల భోగపురుషుల నుంచుకోవచ్చును. పురుషునకు పండ్రెండవ యేడుమొదలుకొని పదునాఱవయేడువచ్చు లోపల వివాహము చేయుదురు. భార్యలకన్న భర్తలు పెద్దవారుగా నుండవలిసిన ందుకు వారనేక కారణములు చెప్పుదురు. అందొక కారణము పురుషులకంటే ముందుగా స్త్రీలకు యుక్త వయస్సు వచ్చుట . స్త్రీలకు యుక్తవయస్సు వేగిరముగ వచ్చుటయే పురుషులకంటే స్త్రీలు శ్రేష్ఠురాండ్రగుటకు గొప్పనిదర్శనమనివ్వరు చెప్పుదురు. భర్తలు భార్యల కంటే పెద్దవారుగా నుండవలెననుట కింకకారణము పత్ను లెదిగిన తరువాత కనిపెట్టు కొని యుండ కుండుటకును, పురుషులు పత్నీ సేవ చేయిటకు సమర్ధులుగా నుండుటకు అని యీవఱకే చెప్పబడినది. అక్కడ వంటాచేయవలసిన వారు పురుషులేననియు నీవఱకే చెప్పబడినది. మనదేశామునందువలె స్త్రీలు వంటచేసెడు పక్షమున, వాఅరు గర్భిణులయి ప్రసవించిన సమయములు మొదలయిన వానియందు వుఘ్నము కలిగి చిక్కులు కలిగునుగనుక, అటువంటి ఆటంకములు కలుగకుండుట కయి భగవంతుడే పురుషులను పాకము చేయు వారినిగా నిర్మించెనని వారు వాదింతురు.

మనదేశము నందు స్త్రీలకు రాణీవాసమున్నట్లే యాదేశామునందు పురుషులకును గలదు. మనదేశమునం దట్టియాచారము లేకపోవుటచేత దానుకేమని పేరు పెట్ట వలయునో నాకు తెలియకున్నది. రంఢీభాష