పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లము, బెల్లము, బట్టలు, తట్టలు, ఆవులు, మేకలు మెుదలైన వానిని జూపి వాని పేరు లేమని సైగచేయుచురఁగా నాతఁడు చెప్పుచు వచ్చెను. ఆ పేరులన్నియు నేను వేంటఁగోనిపోయిన తెల్లకాగితముల పుస్తకము మీద తెలుఁగులో వ్రాసికొని వల్లించుచు వచ్చితిని. మెుదట దినమున నేనమాటలను వ్రాయుచుండగా నతఁడుచూచి యత్యాశ్చర్యపడెను కారనము మీకు ముందుచెదను. మికు విసుకు దలగా నుండును అంతేకాక ఇటువంటి వర్ణముల వలన మీకును నాకును గూడ లాభము లేదు. విశేష ప్రయాస పడి మూడు మాసములలో వారి బాష నొక రీతిగా నేను ధారాళముగా మాటాడుటకు నేర్చుకొన్నాను.


నాల్గవ ప్రకరణము

ఒకనాఁడు సెలవు దినమున బోజనము చెసి కూరుచున్న తరువాత నా యజమానుఁడైన ఫాండీ భంగీ నన్నుఁజూచి జాలితో నీపత్నిపోయినది కాదాయని రంఢిభాషలో నడిగెను. వారి దేశమును మనము స్త్రీ మళయాళమన్నను స్వదేశస్థులు దానిని రంఢీదేశమని వాడుదురు. నన్నతఁడా ప్రశ్న యడుగఁగానే యాతని జ్ఞానమునకు నేనత్యాశ్చర్యపడి, అతని జ్యొతిశ్శాస్త్ర పరిజ్ఞానము వలననే యీ సంగతి తెలిసినది యెంచుకొని, ఆ శాస్త్రమును గ్రహింపవలెనను తలంపుతో “అయ్యా! నా భార్య స్వర్గస్థరాలైనసగంతి మీకెట్లు తెలిసినది?" అని యడిగితిని.


ఫాంఢీ: (చిరునవుతో) నీ పత్ని పోయినసంగతి మత్రమే కాక యామె నీచిన్నతనములోనే పోయినదని కూడ నీ రూపము చేతనే నేను గ్రహించినాను.