పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్రము

నేనప్పటినుండియువీండ్రనుబట్టుకొనుటకుభ్బటులనుబంపివెదకించున్నను.

కృష్ణ---ఏమిరా?గుఱవమిమ్మియనయెక్కడికయినపంపినాండా?లేకమిరేగోడదూకిపాఱిపోయినారా?

గుర--మహాప్రభూ!నిన్నప్రొద్దున్నమమిద్దఱనుపిలిచియీరాజుగారుచిన్నధానినిరవణక్కపేటకెత్తుకొనిపోయి,యక్కడపద్మరాజునకొప్పగించవలసినడనియాజ్నాపించినారు.చిన్నదిరాంగానేదొంగతనముగాపెండ్లియాడుటకైపధ్మరాజుముందుగానేపోయియక్కడనున్నాండు.

శోభ--కాదుకాదు.ఈదొంగలంజకొడుకులుపాఱిపోయి,తప్పించుకొనుటకయియీలాగునబొంకుచున్నారు.

గుర--ఈరాజుదొంగలగురువు.మునుపుమాచేతబారులుకొట్టొచితిన్నగామాసొమ్ముమాకియ్యకసకలమయినచిక్కులుపెట్టినాండు
ఈబ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి యాయనమూలముగా పడ్డ పాట్లు తలచుకొన్న నిప్పటికి మాకు దుఃఖమువచ్చు చున్నది.

క్రష్ణ--వెనుక నీ ప్రకారుముగా దారులు దోపించినావా?

శోభ--లేదులేదు.విధవ కొడుకులబద్ధమాడుచున్నారు.

గుర--మామాటలబద్ధమేమో పాపయ్యగారిని పిలిపించి విచారించవచ్చును. ఇప్పుడాయన యీచరసాలలొనే యున్నాడు.

క్రష్ణ--ఓరి! పాపయ్యను పిలుచుకొనిరా.
కొంతసేపటికి పాపయ్యవచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్షతగ్గించెదమని వాగ్దానము చేసినందున మొదటినుండియు నాతని చర్యయంతయు నేకరవుపెట్టెను. ఆందుమీద శోభనాద్రిరాజు మఱుపలులుక నోరురాశ క్రిందచూచు మిన్నకుండెను. రాజుగారి.