పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రింకొక నిమిషము రాకపోయినయెడల, వాడు బెదిరించి నాయొద్ద నేమైన గాజేయునుజుండీ.

ఉమా-ఏడీ నిన్ను తొందరపఱిచినవాడెవ్వడు ?

సుబ్ర-మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లగా జాఱి దూరమునుండి పారిపోవుచున్నాడు.

ఉమా-పోనీ. వానిసంగతి రేపు విచారించి కనుగొందుము. అని మాటలాడుకొనుచు వారిద్దఱును గలిపి యింటివంక నడచిరి. ఇల్లు చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాఁటివఱకు స్ంభవించిన విపత్తులును ప్రస్తుతపు స్దితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసనపడి తాను చిన్నతనములో రాజశేఖరుఁడుగారి వద్దఁజదువుకొన్నప్పు డున్న యైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానముచేసిన గురువు విషయమై శక్తి వంచన లేక ప్రయత్నముచేసి చేతనయిన యుపకారమును పలువిధముల నాదరించి, తాను పిఠాపురపు రాజుగారియొద్ద నిరువదిరూపాయల యుద్యోగములోనున్న సంగతినిజెప్పి, అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దఁ బ్రయత్నము చేసెదననియు పనియైనదాక తనయింటనే యుండవలసినదనియుఁ జెప్పెను. ఆప్రకారముగా ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనముచేసి యుమాపతిగారితోడఁ గూడ రాజసభకుఁ బోవుచుండెను. పీఠికాపురాధీశ్వరుఁడయిన విజయరామరాజుగా రొకనాఁ డాతనిజూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారిస్ధితిగతులను మొదట నుండియుఁ జెప్పి యాస్తానములో నేదియయిన నొక యుద్యోగ మీతని కిప్పింపవలయు ' నని మనవిచేసెను.