పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

Insert non-formatted text here

పదవ విక్రయం

ములందుఁ | బ్రౌణవి త్తమాసభంగమందుఁ | జకితగోకులాగ్రజన్మరక్షణ మందు | బొంకవచ్చు సఘము పొందదధిప." అను శుక్రనీతిని దలఁచు కొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంతమనస్సమా ధానము చేసికొన్నాను. ఈనీతిని బట్టియే యెవ్వరును మీతోఁ బద్మ రాజు విషయమై ప్రస్తావించినవారు కారు.

రాజ-ఇప్పుడేపోయి యీసంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలును మొగము మీఁదనే యనివేసి వచ్చెదను.
అని వెంటనే పోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలుచుండియుండఁగా జూచి "మీ రేమో గొప్పవా రనుకొని మీమాటలనమ్మి మోసపోయినాను. మీతో నింతకాలము స్నేహముచేసినందుకు, నాకొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు ? అని నిర్భయముగాఁ బలికి రాజ శేఖరుఁడుగారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము" అని నిలువఁ బెట్టెను. మీరిచ్చిన రూపాయలును నాయొద్దనున్న రూపాయలునుకూడఁ గలిపి వానితో వివాహమునకు వలయువస్తువుల నెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలోనున్నప్పు డిచ్చెదను." అని వెళ్లిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తనభటులచేత రాజశేఖరుఁడు గారిని పట్టి తెప్పించి చెఱసాలలో బెట్టించెను. ఆసంగతి మాణిక్యాంబకు దెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలఁచుకొని నిద్రాహారములు మాని స్దా యీశ్వరధ్యానము చేయుచు లోలోపల దు:ఖించి కృశించుచుండెను.
ఈసంగతి జరిగిన మూఁడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండగా నెవ్వరో యిద్దరు మను