పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

పచ్చమ్రుగ్గు, ఆకుపసరు మ్రుగు తెచ్చి వానితో భేతాళుని స్వరూపము వ్రాసి భేతాళ యంత్రము వేసి పూజచేసి ధూపదీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి రావియాకులతో కుట్టిన యేడువిస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక కొయ్యనుపాతి దానికి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాఙనుగట్టి, ఈయన జరిగించవలసినవి యంతము జరిపినాడు. తరువాత మేము కుంభమును బండిలో నెత్తించుకొని యీకఱ్ఱలతో గృహలమీఁద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇఁక గ్రామదేవత గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును.

సుబ్ర-ఆలాగయిన నేనుమి వచ్చెదను.
అని సుబ్రహ్మణ్యము వారివెంటఁ బయదెఱెను. అందఱును గ్రామ దేవత గుడిచేరినతరువాత యంత్రఙఁడు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాఙను ఈప్రకారముగా జదివెను.

     యంత్రఙఁడైన వీరదాసుగారు ఒఎద్దాపురము గ్రామదేవత అయిన మరీడిమహలక్ష్మికి చేసుసినయాఙ-ఈగ్రామములో ఏదో గ్రహముచేరి యిండ్లు కాల్చుండఁగా ఈగ్రామమునకు దేవత వయియుండియు నీ వూరికే చూచుచుండుటకు నిమిత్తములేదు. ఆగ్రహమునకు నీతరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ కుంభము ఆగ్రహమునకిచ్చి మఱుమన్యమయిన కొండలమీఁదికి దానిని పంపివేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేతఁగాని శ్రీహనుమానుల చేతగాని కఠినమనయినతాఖీదును పొందఁగలవు.

                  "శ్లో|| యక్షరాక్షస దుష్టానాం మూషగా శ్శలభాశ్శుకా
                             క్రిమికీట పంతగానా మాఙాసిద్ధిర్విభీషణ."