పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడుములు డప్పులు మోగుచుండఁగాకొందఱు బండి మీఁద కుంభమును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు నడుచుచుండిరి; వారి వెనుకను జనసంఘము మూఁకలు కట్టి తమ చేతులలోని కఱ్ఱలతో త్రోవపొడుగునను ఇండ్ల మీఁద కొట్టుచుఁబోవుచుండిరి. ఆమూఁకలలో నుండి సత్రపుఁ బ్రాహ్మణుడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకఱ్ఱ పెట్టుకొని దేహమంతటను జెమ్మటకాలువలు గట్టి వచ్చి సుబ్రహ్మణ్యము చేయిపట్టుకొని ." నిన్న నేను జేప్పునప్పుడు డబద్ధమంటివే, ఇప్పుడయిన నామాట నమ్మెదవా?" యని క్రిందకి లాగెను.

సుబ్ర--- ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది?

సత్ర--- నిన్న చేప్పలేదా? ఇండ్లు కాల్చుగ్రహము గ్రామమునకు వచ్చినప్పుడు ఈ ప్రకారము చేయుదురు. ఒక చేతిలో వేపమండయు రెండవచేతితో వేపబెత్తమును పట్టుకొని ముందునదుచుచున్న యతనిని జూచునావా?

సత్ర---పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతఁడు కాఁడా? చూచినాను. అతఁడెవరు?

సత్ర-అతఁడే యీతంతు నడిపించుచున్న మంత్రజుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు కాల్చుచున్న దేవతను కొంచెము సేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు.

సత్ర- ఇంటి కొకటి రెండేసి చేరల బియ్యము చొప్పున ఏడిండ్లలో అడిగి పుచ్చుకొని, క్రొత్త కుండ తెప్పించి గ్రామము న డుము వీధిలో పొయ్యిపెట్టి ఆకుండతో అడిగిపుచ్చుకున్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జాము వరకు వంట చేసి , ఆకుండను దిగువ దించితుంచి నవీధి నలికి యెఱ్ఱముగు. తెల్ల ముగ్గు ,నల్లముగ్గు