పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర విజయము


గదా ? మీరు నామాటలను లక్ష్యముచేయక యీయాపదను దెచ్చి పెట్టుకొంటిరి .

రాజ- ఓహోహో! రామరాజుగారిరాశి మీరు మాపాలిట దైవమువలె సమయమునకు వచ్చి మా యందఱిప్రాణములను నిలువఁబెటిరి. మీ రింకొక నిమిషము రాకుండిన మేమందఱము నాదుర్మార్గుల చేతులలోఁ బడిపోయి యుందుము. మీరీవేళ నిక్కడ కెట్లురాఁగలిగితిరి?

రామ - మీతోవచ్చిన కిరాతుఁడు యోగిచే దొంగలను బిలుచుకొని వచ్చుటకయి పంపఁబడి యెండలో నడువలేక యొక పాకలోఁ బరుండియున్న నన్నుఁ ద్నవారిలో నొకనిగా భ్రమించి తనగురువు కొందఱుఁ బ్రాహ్మణులను దోఁచుకొనుటకు కయి యీ చింతచెట్టు వద్దకి వెళ్ళుచున్నాఁడని చెప్పెను. ఆమాటలు విన్న తోడనే యాబ్రాహ్మణులు మీరే యని యూహించి నాకచట గాలు నిలువక దొంగలను వారింపవలె నను నుద్దేశముతో యోగియున్న తావునకు బోతిని. అక్కడ నావరకే దొంగలు వచ్చి యోగితో మాటాడి పోయినారన్న వార్త విని గుండెలు పగిలి నేను వచ్చు లోపల మీకేమి యుపద్రవమువచ్చునో యని మార్గాయాసమున నేమియు లక్ష్యము చేయక యొక్క పరుగున వచ్చి యుక్త సమయమున మీకుఁదోడు వడఁగాంచి నా జన్మము క్రతార్ఠత గనెనుగదా యని సంతోషించుచున్నాఁడను.

అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశఖపర్యంతము తడవిచూచి గొంతెత్తి యేడ్వఁజొచ్చెను. రామరాజును రాజశేఖరుఁడుగారును గూడ దగ్గఱకు బోయి చూచి కడుపుపట్టి చూచి ముక్కు దగ్గఱ వ్రేళ్ళుపెట్టి యూపిరి గానక దెబ్బ చేతను భయముచేతను