పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము


బలి యిప్పించెదనని మాణిక్యాంబమొక్కుకొనను. ఈ ప్రకరముగా వ్యాకులపడుచు వారు నడిచి యొక విశాలస్ధలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంటముందఱఁ గూరుచుండి యున్న రెండు విగ్రహములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో చుట్టలంటించి బుజములమీఁద దుడ్డుకఱ్ఱలతో వారి వంక నడచి రానారంభించెను. వాండ్రను జూచినతోడనే వారి కందఱకును పయి ప్రాణములు పయినిపోయినాయి; వెనుకనున్న కిరాతుఁడు దొంగలని కేకకేసి వెనుకవాఁడు వెనుకనే పాఱిపోయెను, ఇంతలో నాదొంగలలో నొకడు ముందునకు వచ్చి రెండు చేతులతోను కఱ్ఱను పూనిపట్టి, మాటాడక ముందున్న రుక్మిణి నెత్తిమీఁద సత్తువకొలఁది నొకపెట్టు పెట్టును. ఆ పెట్టుతో మొదలునఱికిన యరఁటి చెట్టువలె రుక్మిణి నేల కొఱిగి నిశ్చేష్టురాలయిపడియుండెను. ఇంతలో నెవ్వఁడో కత్తి దూసికొని ' ఆగు ' 'ఆగు ' మని కేకలు వేయుచు, మెఱుపు మెఱసినట్టు మీఁదఁబడి దొంగలలో నొకనిని మెడమీఁద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీఁది కెగరి దూరముగా బడఁగా మొండెము భూమి మీఁద బడి చిమ్మనగొట్టములతోఁ గొట్టినట్లు రక్త ధారలు ప్రవహింప కాళ్ళతోను చేతులతోను విలవిలఁ గొట్టుకొనచుండెను. శత్రు వాయుధపాణియమయుండుటయు, తానొంటిగాఁడగటయు, బాటసారులలో మఱియిద్దరు మగవాండ్రుటయు చూచి కిరాతునితో గూడికొని రెండవ దొంగవాఁడు కాలికొలఁదిని దూఁటెను. ఖడ్గపాణియైన యాపుణ్యాత్ముఁడు వాండ్రను కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములోఁ జూపుమేరదూరము దాఁటి యద్రశ్యలయినందున వెనుకకు మరలి వచ్చి రాజశేఖరుఁడుగారిని కలిసికొనెను.

రామ-రాజశేఖరుఁడుగారు! ప్రొద్దుండగానే యీస్థలమును దాఁటవలసినదని నేను మధ్యాహ్నాముననే బహువిధములు భోధించితిని