పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

మిమ్ముఁ గూడూకొన్నాను. దొంగలు కొట్టు స్ధలమునకు సమీపములో నున్నాము అయినను మీ కేదియు భయము లేదు. మనుమీమార్గమున విడీచి కాలిమార్గమునఁ బోయి భయపడవలసిన స్ధలమును దాఁటిన తరువాత పెద్దబాటలో వెళ్ళి చేరుదము.

రాజు- అలాగునుయినను మమ్ము సుఖముగాఁ దీసికొని వెళ్ళవలసిన భారమునీది. నీ వేత్రోవనురమ్మన్న నా త్రోవనే వచ్చెదము.

అప్పుడాకిరాతుఁడు వారిని పెద్దత్రోవ నుండి మరలించి యిఱుకు దారిని వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాఢాంధకారబంధురముగా నుండెను. చెట్ల మీఁది పక్షులు కలకలము లుడిగెనుగాని గ్రుడ్లగూబ మొదలగు కొన్ని పక్షులు మాత్రము మేఁత కయి సంచరించు చుండెను; చిమ్మటలు కీచుమని దశదిశలయందును ధ్వనిఁ జేయఁజొచ్చెను; అడవిమృ గములయొక్క కూఁతలును పాముల యొక్క భూత్కారములను కర్ణకఠోరములుగా వినఁబడుచుండెను. నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కుమని మెఱుపొక్కటి కొంచము త్రోవ కనఁబడుచుండెను. ఈ రీతిని కొంచము దూరము నడిచిన తరువాత వెలుతురగపడెను; ఆ వెలుతురు సమీపించినకొలఁదిని గొప మంటగా నేర్పడుచు, ఒకగొప్ప చింత చెట్టునకు సమీపముగా నుండెను. చీఁకటిలో నీ ప్రకారముగా నడుచునప్పుడు రాజశేఖరుఁడు గారి ప్రాణము లాయనదేహములో లేవు.; తక్కిన వారును అఱచేతిలో ప్రాణ్ములు పెట్టుకొని కాళ్ళీడ్చుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తప్పించుకొని యేదైన నొకయూరు చేరితిమాయిఁక నెప్పుడును దారి ప్రయాణము చేయ మని యెల్ల వారును నిశ్చయము చేసుకొనిరి, ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేఁకపోతును