పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

యోగి- అవును. మీరు చెప్పిన మాటనిజమే. మీరు నడుచుచుండుండి.వాండ్రు వచ్చిమిమ్మిప్పుడేకలసికొందురు.

అప్పుడు రాజశేఖరుఁడుగారు పెండ్లముతోను బిడ్దలతోను బయలుదేఱి దొంగలపేరు జ్ఞప్తికి వచ్చినప్పుడెల్ల గుండెలుతటతటఁగొట్టుకొన, బుజముమీఁది మూటనుపలుమాఱు తడవిచూచుకొనుచు, చీమచిటుక్కుమన్న వెనుకఁదిరిగి చూచుచు, కొంచెమెక్కడనయినను పొదకదలిన నులికిపడుచు నడుచుచుండిరి. ఆయోగిచేఁ బంపఁబడిన కిరాతుఁడును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్టముగా కల్లునీళ్ళుతూలుచు తల వణికించుచు చింతణిప్పులవలెనున్న గృడ్లుత్రిప్పుచు సంకేతస్థలమునుజేరి, అక్కడనొక పాకలో నొదురించుచున్న మనుష్యునిచేతితో గొట్టిలేపి,"ఓరీ! ఒక బ్రాహ్మణుఁడును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలును నూఱురూపాయలతో వెళ్ళుచున్నారు. కాఁబట్టి మీరు చీమల చింతదగ్గఱకు వేగిరము వెళ్ళవలెనని మన గౌరువుగారు చెప్పినారు" అని చెప్పి పోయెను. అతఁడామాటలు విన్నతోడనే కొంతసేపేమో యాలోచించి సంతోషపూర్వకముగా లేచి, ఆత్రోవలను సంకేత స్థలములను నె!ఱిఁగియున్నవాఁడు కావున మాఱుమాటాడక కత్తినిచేతఁ బట్టుకొని పాకవెదలి బయలుదేఱెను.ఆకిరాతుఁడును అడ్డుత్రోవను బోయిదారిలోఁగనబడ్డ మఱియొకనితోఁగూదఁజెప్పితిరిగి యోగిని గలిసికొని యాతని యుత్తరువుప్రకారమువిల్లునునమ్ములునుధరించి వారిని మార్గముతప్పించి చీమలచింతయొద్దకుఁదీసికొనిపోవుటకయి పగెత్తుకొని పోయి సంజచీఁకటివేళ వారిని గలిసికొనెను.

కిరా- అయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీకాపుదలకయి నన్నుఁబంపినారు.మంచిసమయములో వచ్చి