పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

అను శ్లోకము జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సరఫలమునుజెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదులయొ క్క యు వృద్ధిక్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియనియెడల నామనక్షత్రములను తెలిసికొని యెల్ల వారికిని కం దాలయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడ నున్నకావులు మొదలగు వారు సిద్ధాంతిగారి చేతిలో నేమైనఁబెట్టి తను కేకందాయమున్ందును నున్నలు రాకుండఁ జేసికొనిరి. పంచాంగశ్రవణ మయిన తరువాత రామమూర్తిగారు-"సిద్ధాంతిగారూ ! కలియుగము ప్రారంభమయి యిప్పటికెన్ని స్ంవత్సరము లయినది?"

        సిద్ధాంతి-ఇప్పటికి కలియుగాది గతసంత్సరములు ౪౭౧౯ శాలివాహనశకాబ్దములు ౧౫౪౧, విక్రమార్క శకసంవత్సరములు ౧౬౭౬.
       రామ-మనదేశములో మ్లేచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో కాలమానమునుబట్టి చెప్పగలరా?                                                                                                                                                          

సిద్దాంతి-మనదేశములో తురష్కుల దొరతనము అయిదు వందల సంవత్సరములకు లోపలపోదు. ఆపిమ్మట పూనపాటివారివంశమున వేపకాయంత తోకఁగలవా డొకఁడు పుట్టి, ఆనేతుహిమాచలమును గల సర్వప్రపంచమును మరల జయించును.

అంత ప్రదోషనమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందఱును తమతమ యిండ్లకు నడచిరి.

రాజశేఖరుఁడుగారు విదియనాడు కాశీయాత్రకు బయలుదేఱ నిశ్చయించుకొని యెంద రెన్నివిధములఁ జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో పంచాంగమును జదివిన పిదపర్తి శ్ర్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆతఁడును తిధివారనక్షత్రములను చక్కఁగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది </poem>

                             14