పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

195


చ.

గురుచరలింగపూజ లొనగూర్పఁగ నుద్భటు కంతఁ గంతు సం
హరుఁడు ప్రసన్నరూపమున నన్నియుఁ దానయి నిత్యనీమముల్
జరుపఁగ వచ్చి తత్క్రమము సాంగముగా నొనరింపఁ జేసి యీ
కరణి నద్రుశ్యుఁడై మెలఁగఁగా మహిమాన్వితుఁడయ్యె నుర్వరన్.

317


గీ.

తద్భుధులలో సుబుద్ధి యన్ ధరణిసురుఁడు
సుగుణమణిగుణసౌభాగ్య సుందరి యను
పేరుగలిగిన కూతుఁరఁ పెండ్లి చేసె
నుద్భటారాధ్యునకు నీశ్వరుండు దెలుప.

318


వ.

అట్లు గావున.

319


శా.

శ్రీకంఠాపరమూర్తి దుర్మతలతాశ్రేణీలవిత్రంబు సు
శ్లోకున్ సంతతతత్త్వదర్శనపరున్ శుద్ధాత్ము నాచార్యచూ
డాకల్పంబు వినమ్రకల్పకము వేదాంతార్థనేతృత్వల
క్ష్మీకంజాగను సాంద్రభక్తిఁ గొలుతున్ శ్రీయుద్భటారాధ్యులన్.

320


మ.

జనియించెన్ హరుమానసంబునఁ బిశాచత్వంబు మాన్పించి ది
వ్యనికాయంబుల శంభుమూర్తి గనఁ జేయంజాలెఁ గైలాసశై
లనివాసంబునఁ గట్టఁ బట్టము బుధశ్లాఘార్హత న్మీఁదటన్
జననప్రాభవపుణ్యముక్తి కతని శ్శక్యంబె వర్ణింపఁగాన్.

321


సీ.

వరశమాకరలబ్ధవర్ణపుంగవులచే
        బోలె విజ్ఞానవిస్ఫూర్తిఁ గాంచి
దృఢసత్ప్రభావనత్తీర్థోదకములచేఁ
        బోలెఁ బావనవృత్తిఁ బొందఁజాలి
శారదారంభవిస్మేరేందురుచులచేఁ
        బోలె నాహ్లాదంబు చాలఁ దాల్చి
చారుప్రభాసాంద్రజాతిరత్నములచేఁ
        బోలె నలంక్రియాశ్రీల మెఱసి