పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

ఉద్భటారాధ్యచరిత్రము


క.

ఈ మహిమ యెట్టిదో మన
కామితము గూర్చఁ దలఁచి కాశీపతి దాఁ
బ్రేమన్ బ్రత్యక్షంబై
పామరులను బ్రోవఁ గురుని భావముఁ దాల్చెన్.

311


మ.

అనుచున్ మౌనముతోడ విశ్వపతి నాత్మాబ్జంబునం జేర్చి నం
తనఁ గన్మోడ్పు ఘటిల్లె [వారలకు నా ధ్యానంబు మై]తోఁచ ని
ట్లనియెన్ మామకహంశు నుద్భటు సమాఖ్యారాధ్యశబ్దంబు చూ
చిన తద్బ్రహ్మముఖోద్భవోత్తమముచే విఖ్యాతిఁ జెందెన్ భువిన్.

312


ఉ.

శంక యొకింత లేక ద్విజసంఘము లెల్లెడఁ గూడి పాపముల్
నింక షడక్షరీమనుపు నీమముతో నుపదేశ మొంది ప
త్పంకజపూజలన్ దనిపి పావనమై తగుకన్యకాదిభ
వ్యంకరదానముల్ ఒసఁగి వర్ధిలుఁ డీగురుమూర్తి దీవనన్.

313


క.

అని కాశీవిశ్వేశ్వరుఁ
డనుపమమృదుమధురఫణితి నాడిన మోదం
బున మేలు కాంచి యుద్భటుఁ
గని తచ్చరణముల వ్రాలి కాంక్ష నుతించిర్.

314


శా.

ఆ వార్తల్ విని రాజమంత్రిసచివవ్యాపారముఖ్యుల్ ప్రభుల్
శైవోద్ధారునిఁ గోటిమన్మధసమశ్రావ్యాంగునిన్ ఉద్భటున్
సేవిం చీశ్వరమంత్రదీక్షల శుభశ్రీ లొంది గ్రామాలయ
ప్రావీణ్యంబగు దాసముల్ ఒసఁగ నారాధ్యప్రభన్ వర్ధిలెన్.

315


ఉ.

ఉత్తరశైవదీక్షల గురూత్తముఁ డుద్భటుఁ డీద్విజాళియం
దుత్తము లిష్టలింగు లని సూక్తులు చెప్పియు లింగధారణల్
కుత్తుకలందుఁ గొందఱకుఁ గూర్పఁగ రాజులు మంత్రివర్గముల్
చిత్తములుం జిగుర్పఁగను శిష్యులునై గురుపూజ చేయఁగాన్.

316