పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

107


గీ.

వలపు గలిగియు జనయిత్రివలన వెఱచి
కనకలత దక్కి మాఱుమొగంబు వెట్టె
నీతెఱంగునఁ జెడెగాని (యింతవుణ్య
కర్మసం)స్కార మతనికిఁ గలుగదయ్యె.

233


సీ.

మును మ్రుచ్చిలించి తెచ్చినయర్థ మంతయు
        నప్రస్తుతము వెచ్చమైనకతన
మనము నిల్పక పోయి మగువసొత్తునఁ దిన్నఁ
        గని తన్ను జనులు గైకొననికతన
(తనకష్టసుఖములఁ గను)చుట్ట మెవ్వఁడు
        మానుగ నేచ్చోట లేనికతన
నున్నతభోగంబు లన్నాళ్లుఁ గల్గి బి
        ట్టొకసారె నవియెల్ల నుడుగుకతన


గీ.

ప్రాణపదమైన యెలనాఁగఁ బాయుకతన
తొంటితేజంబు నుఱవేది (దుఃఖి యగుచుఁ)
బురములోపల వసియింప వెరవుమాలి
యరిగె నెందైన నాబ్రాహ్మణాథముండు.

234


క.

ఈ చందంబునఁ జని యా
నీచాత్మకుఁ డొక్కచోట నిలిచి మనములో
జూచును విత్తార్జన మె
ట్లైచేయుటొ యేమిభంగి నగునో యనుచున్.

235


చ.

వసమరి విత్తహీనుఁడగువాఁడును బ్రాణము లేనివాఁడు ధా
త్రి సములుగాఁగ నెన్నుదురు ధీనిధు లట్లగు గాన నాకు వె
క్కసముగ విత్త మేకరణిఁ గల్గెడిఁ బ్రాణమువోలె దాన నా
వసముగఁ జేయనొక్కొ ప్రియభామిని రూపమనోజకామినిన్.

236