పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45


పసిబాలకుఁడు వేడ్క భాషణమ్ములఁ గూడఁ
        బెట్టు నీశ్వరగుడి గట్ట ననుచు
నతిదరిద్రుండు శైవారాధనమునకు
        బొదపెట్టు ప్రాణంబుఁ గుదువవెట్టి
అఖిలదూషకుఁడైన నాహార మొల్లఁడు
        భసితంబు నొసలిపైఁ బ్రామికాని


గీ.

గొల్లవాఁడును శివకథాగోష్ఠిఁ గొంత
ప్రొద్దుపుచ్చును గడుభక్తిఁ బొలములోన
సకలశివభక్తమకుటాగ్రజాతిరత్న
మతఁడు పాలించుధారుణియందు నెల్ల.

177


సీ.

ముగ్ధచంద్రకిరీటుమూర్తి వీక్షింపని
        ఖలుని వీక్షింపఁడు కన్ను విచ్చి
వృషభేంద్రవాహను విమలచారిత్రంబు
        పలుకనిజడుతోడఁ బలుకఁ డర్థి
హరునర్చనావేళ నంటఁగాననినీచు
        నంటడు కల గాంచునవసరమునఁ
బురవైరి మానసాంభోజకర్ణికఁ గూర్పఁ
        దలఁపని కష్టాత్ముఁ దలఁపఁ గోరఁ


గీ.

డంబికానాథునగరికి నరుగనట్టి
భాగ్యహీనుల భవనంబుపజ్జ నరుగఁ
డఖిలశైవరహస్యసిద్ధాంతవేది
పరమనిర్మలగుణవార్థి పార్థివుండు.

178


చ.

జడధులు మేరగాఁ గల రసావలయంబు నిజాంనపీఠిపై
నిడి ప్రమథేశ్వరుండు ప్రమథేశ్వరతుల్యుఁడు వృద్ధిఁబొందుచో
బుడిసెఁడునీళ్ళఁ బూన నొకపువ్వు నెఱుంగని పాడుగుళ్ళలో
మృడులకుఁ గల్గెఁ గుంకుమవిమిశ్రితనీరము రత్నహారమున్.

179