పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఉద్భటారాధ్యచరిత్రము


చటులప్రతాపాంకుశము శత్రురాజన్య
        కరిశిరస్స్థలులపై నిరవుకొలిపి


గీ.

పలికి బొంకక గుణముల వెలితిగాక
నడక సడలక యడిగిన గడుసువడక
యన్వయాచార మెడలక యాదిశైవ
లక్షణంబుల నాధరాధ్యక్షుఁ డమరు.

166


మ.

తన జిహ్వాంచలరంగమధ్యమున విద్యానర్తకీరత్న మిం
పున నర్తింపఁ గరాంబుజంబున మరుద్భూజంబు చూపట్టఁ జూ
పునఁ జింతామణి విశ్రమింప వినయంబున్ విక్రమంబున్ జగ
ద్వినుతౌదార్యము బాహువీర్యమును జెందెన్ రాజు రాజత్ప్రభన్.

167


చ.

భరత భగీరథాంగ గయభార్గవరామ యయాతిముఖ్య భూ
వరచరితానుపాలన మవశ్యము తెల్లమిగాఁగ భూప్రజం
గురుభుజశ క్తికల్మి ననుకూలముగా జనకుండువోలె సు
స్థిరముగ నేలు నైదుపదిసేయఁ డతండు రణాగ్రవీథులన్.

168


ఉ.

కానుగ రాజధర్మ మని గైకొను లోభముపూని కాదు శి
క్షానియమంబునన్ రిపులఁ గాంచు విరోధముఁ దాల్చికాదు రా
జ్యానుసమానముద్రకు బలావలి నేలు భయంబుఁ బొంది కా
దానరనాథచంద్రుఁడు మహాద్భుత మాతని వర్తనం బిలన్.

169


సీ.

కులిశాయుధుఁడు స్వాతిఁ గురియించు వానలు
        పైరులు ముక్కారుపంటఁ బండు
పురుషాయుషమ్మును బూర్ణమై గరివోదు
        నడవడి చక్కనై నడచుఁ బ్రజకు
ధర్మంబు నాల్గుపాదంబుల వర్తించుఁ
        గలుషంబునకు నెడ గలుగ దింత