ఆత్మవిచారము హింసచేయుస్వభావమున్న యెడల అందుకు కారణమగు దేహాభి మానమును వదలుటవల్ల హింసను జయించుము. ఇతరులవలన దుఃఖముగాని బాధగాని సందర్శించుననిన వారియందు కృప చూపుట చేత వారివల్ల కలుగు బాధను జయించుము. దేహ పీడలను ప్రాణాయామాదులవల్ల జయించుము. నిద్రను ప్రమా దమును సాత్త్వికాహారమువల్ల ' జయించుము. రజోగుణ తమో గుణంబులను సత్త్వగుణముచేతను సత్త్వగుణమును ఉపశమము చేతను జయించుము. ఉపశమమనగా " సర్వం బ్రహ్మమాత్రం అను విచారజన్యజ్ఞానము. పై చెప్పిన అన్నిటినిని గురువుల వారి యందు నిశ్చలభక్తి చేసి సంపాదించుము. జ్ఞానదీపమునిచ్చు గురువు సాద్భగవత్స్వరూపుడుగాని సామాన్యమనుష్యుడు కాడు అను నిశ్చయజ్ఞానము లేనివాని చదువు నిష్ఫలంబు.
ఈ విషయములను ప్రమాద రాహిత్యముతోను సూక్ష్మ బుద్ధితోను విమర్శించి బాగుగ నభ్యసించువారికి కాలక్రమ మున శీలము సాధ్యము. ఇందులో నొక విశేషమున్నది. కృప యా భూతజం దుఃఖం ” అని చెప్పియున్నది. మనకు దుఃఖము కలుగ జేయు వారియందు కృపచూపవలెనట. ఇది లోకులు నవ్వ తగిన విషయము. దుఃఖము కలుగ చేసిన వారికి ప్రతిదుఃఖము కలుగచేయక వారియందు కృపచూపవలెనట. నిశ్చయమే. లోకులధర్మమెట్లుండీనను ప్రవృత్తిమార్గయాత్రచేయుచు " బ్రహ్మా వలోకధిషణు " లై నివృత్తిమార్గ యాత్రయం దాసక్తి చెందిన జీవాత్మలు సాధారణజనులు కారు. వారు అసాధారణులు. వారి ధర్మము అసాధారణధర్మము.