ఇంతేకాక, కాపులు మరియు బ్రాహ్మణుల సంక్షేమానికి పథకాలు చేపట్టడం కోసం కూడా బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. ప్రస్తుత బి.సి. వర్గాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా కాపులను బి.సి.ల జాబితాలో చేర్చేందుకు గాను ఒక కమీషన్ ను నియమించనున్నాము.
విజన్ 2029
13. 2022 నాటికి స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా దేశంలో అత్యున్నత పురోగతిని సాధించబోయే మొదటి మూడు రాష్ట్రాల్లో మన రాష్ట్రాన్ని కూడా నిలపడం కోసం మారిన పరిస్థితుల్లో ఒక నూతన అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేయడానికి తగిన ప్రమాణాలు నిర్దేశించడం కోసం విజన్-2020 షత్రాన్ని పునర్లిఖించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవాళ్లు అనేకం. అయినప్పటికీ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక అత్యున్నత స్థానంలో నిలపాలనే చెక్కుచెదరని సంకల్పంతో, దీక్షతో ముందుకు పోగలమని ఆశిస్తున్నాను.
14. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్గా, 2029 నాటికి పౌరజీవన సంతృప్తి మరియు సంతోష సూచికల ప్రకారంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపుదిద్దాలనీ, అందుకుగాను రాబోయే 3 ఆర్థికసంఘాల కాలవ్యవధిని కూడా ఉపయోగించుకోవాలనీ ఈ ప్రభుత్వ ప్రధానలక్ష్యం.
6