పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్లాసు, కాగితం, ఎరువులు, రసాయనాలు మరియు పెట్రోరసాయనాల పరిశ్రమలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ పరిశ్రమలన్నిటికీ 24x7 విద్యుత్ సరఫరా అందించబడుతుంది.

148. రాయలసీమలోనూ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వటానికి ముఖ్యంగా పరిశ్రమలు నెలకొల్పటానికి ప్రత్యేక డెవలప్ మెంట్ ప్యాకేజీను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అవకాశం కలిగిస్తున్నది. ఇందుకుగాను సముచితమైన ఆర్థికచర్యలు చేపట్టవలసిన బాధ్యత భారతప్రభుత్వం మీద ఉన్నది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధికీ, పారిశ్రామికీకరణకూ పన్నురాయితీలు కల్పించడం, అన్నిటికన్నా ముందుగా వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి పరచడం ఉన్నాయి.

149. అంతేకాక, రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులను కొన్ని కేంద్రప్రభుత్వ పన్నులనుండి మినహాయించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ ప్రతిపత్తి ఇచ్చే విషయం మీద కూడా భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. పైగా ఇటీవల తమ బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వ ఆర్థికశాఖామాత్యులు నెల్లూరుజిల్లాలో ఒక స్మార్ట్‌సిటీని నెలకొల్పడంతోపాటు, కాకినాడలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ ను నెలకొల్పుతామని కూడా ప్రకటించారు.

150. పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. కొత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానం, ప్రస్తుతం అమలులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ విండో చట్టాన్ని బలోపేతం చేయడం, ఆన్లైన్ ద్వారా ప్రాజెక్టుల పురోగతి పరిశీలన, పెద్దపెద్ద పారిశ్రామిక పథకాలకు ఎస్కార్ట్ ఆఫీసర్ల నియామకం, ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయింపు విధానంలో

46