పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128. రాష్ట్రంలో రహదారుల మీద సంభవిస్తున్న ప్రమాదాలను ప్రభుత్వం తీవ్రపరిగణనలోకి తీసుకుని, రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో అన్ని రహదారుల మీద రహదారి భద్రతా చర్యలను అమలు చేయటానికి సమగ్ర ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు రహదారి భద్రతకు సంబంధించిన రాష్ట్రస్థాయి సాంకేతిక సంఘంవారి సిఫారసులకు అనుగుణంగా జారీచేయబడ్డాయి.

129. రైల్వేశాఖ వారి నియమనిబంధనలకు అనుగుణంగా ఎక్కువ జనసమ్మర్థం కలిగిన లెవెల్ క్రాసింగ్లకు బదులుగా రైల్ ఓవర్‌బ్రిడ్జిలురైల్ అండర్ బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి. కొన్ని ఆర్‌వోబీలు/ఆర్‌యుబి లు నూటికి నూరుశాతం రాష్ట్రప్రభుత్వ నిధులతో కూడా చేపట్టబడుతున్నాయి.

130. నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు (ఎనీసిఆర్ఎమ్‌పి) 9 తీరాంధ్ర జిల్లాల్లో ప్రపంచబ్యాంకు సహాయంతో అమలుజరుగుతున్న పథకం. తుఫాను విపత్తు వాటిల్లిన సందర్భంలో పునరావాస సామగ్రిని త్వరితంగా చేర్చటానికీ, లేదా ప్రజలను సత్వరమే సురక్షితప్రాంతాలకు తరలించడానికీ జనావాసాల అనుసంధానం, మరియు సైక్లోన్ షెల్టర్ల నిర్మాణం ఈ పథకం కింద చేపట్టబడుతున్నాయి.

131. ఈపిసి పద్దతిలో రూ.130 కోట్ల అంచనా వ్యయంతో 4 బ్రిడ్జిల నిర్మాణాలూ మరియు రూ.165 కోట్ల అంచనా వ్యయంతో మరి 4 మేజర్ బ్రిడ్జిల నిర్మాణాలు రాష్ట్రంలో పురోగతిలో ఉన్నాయి.

132. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2,612 కోట్లు ప్రతిపాదించడమైనది.

41