పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇండియా ప్రతిపాదిస్తున్నది. పొడిగించబడ్డ రన్ వే ప్రస్తుతం వాడుకలో ఉంది. విజయవాడ మరియు కాకినాడల మధ్య ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిరిపోర్ట్ ను కూడా ప్రతిపాదిస్తున్నది.

121. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరి రాష్ట్రంగా ప్రకటించవలసి ఉన్నందున రాష్ట్రంలో చిత్తూరుజిల్లాలోని కుప్పం, కర్నూలు పట్టణం, నెల్లూరు మరియు శ్రీకాకుళంలో గల నో-ఫ్రిల్స్ ఎయిర్ పోర్ట్‌లు ప్రతిపాదిస్తూ వాటికి సహాయం అందించవలసిందిగా భారతప్రభుత్వాన్ని కోరడం జరిగింది.

122. భారతప్రభుత్వం నిర్వహించిన వేలంలో రాష్ట్రప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఎపిజిఐసి) కేజీ బేసిన్లో 4 బ్లాకులకు అనుమతి సాధించింది.

123. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిటిడిసి), ఎపిజిఐసి మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ వారి అనుబంధ సంస్థ అయిన గెయిలగ్యాస్ లిమిటెడ్లచే సంయుక్తంగా ఏర్పరచబడిన సంస్థ ట్రంక్ పైప్‌లైన్లు సిజిడి నెట్వర్క్లు, రీజనల్ గ్రిడ్లు, సిఎన్‌జి, ఎల్ఎన్‌జి దిగుమతి మరియు దాని రీగాసిఫికేషన్ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వ్యాపారంలో పాలుపంచుకోవడానికి ఎపిజిడిసి ఆసక్తి కనబరస్తున్నది.

124. సహజవాయువుకు సంబంధించిన గిరాకీ మరియు సరఫరాలో నానాటికీ పెరుగుతున్న వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకుని తీరాంధ్రంలో ఒక ఎల్ఎన్‌జి ఇంపోర్టేషన్ టెర్మినల్ను నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతున్నది. ఇందుకు సంబంధించిన గిరాకీ రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇంధనశాఖ, ఎరువులు, రిఫైనరీ,

39