పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 975 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది. ఈ తీరంలో విశాఖపట్నంలో గల ఒక మేజర్ నౌకాశ్రయంతో పాటు 14 నాన్ మేజర్ నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్ మరియు 'రవ్వ' లోగల ఒక కేప్టివ్ పోర్టుల్లో వాణిజ్య కార్యక్రమాలు నడుస్తున్నాయి.

118. 2013-14 సంవత్సరంలో ఈ నౌకాశ్రయాలన్నిటిలోనూ ఇంతవరకూ ఎన్నడూ లేని విధంగా 58 మిలియన్ టన్నుల వస్తు రవాణా జరిగింది. తద్వారా రూ.144 కోట్ల ఆదాయం సమకూరింది. 2014-15 సంవత్సరంలో 65 మిలియన్ టన్నుల వస్తు రవాణా చేపట్టడం ద్వారా రూ. 153 కోట్ల మేరకు ఆదాయం ఆశించడం జరుగుతున్నది.

119. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం మచిలీపట్నం నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నది. ప్రస్తుతమున్న నాన్ మేజర్ నౌకాశ్రయాలతోపాటు, ప్రభుత్వం 14 మైనర్ పోర్ట్‌లను కూడా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భావనపాడు, కళింగపట్నం రేవు పట్టణాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో రెండవ పెద్ద నౌకాశ్రయాన్ని నెలకొల్పాలనే ప్రతిపాదనతో పాటు, ప్రైవేటు రంగంలో కాకినాడలో మరొక వాణిజ్య పోర్ట్ నెలకొల్పాలనే ప్రతి పాదనలు భారతప్రభుత్వం నుంచి అందినవి.

120. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడపలలో గల విమానశ్రయాలను విస్తరించడానికీ/ఆధునీకరించడానికీ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి సహకరిస్తున్నది. విజయవాడ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్ భవనాన్నీ మరియు ఒక కంట్రోల్ టవర్లు నిర్మించడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్

38