పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70. ప్రాదేశిక అసమానతలను సరిదిద్దడం, మౌలిక సదుపాయాల కల్పనలోనెలకొన్న వ్యత్యాసాలను ప్రస్తుతం అమలుజరుగుతున్న పథకాల ద్వారా పూర్చలేని కీలక ప్రాంతాల్లో పూర్చడానికి ప్రయత్నించడం కోసం నాలుగు జిల్లాల్లో బిఆర్‌జిఎఫ్ కార్యక్రమం అమలుజరుగుతున్నది.

71. దిగువస్థాయిలో ప్రజాస్వామిక పాలనలో ప్రజలభాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం గ్రామీణప్రాంతాల్లో సేవల నిర్వహణను మెరుగుపర్చడం కోసం గ్రామసభలను, ఇతర పంచాయితీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం కోసం ఆర్‌జిపిఎస్ కార్యక్రమం ఉద్దేశించబడింది.

12. 2013-14 లో వివిధ సమగ్ర తాగునీటి సరఫరా పథకాలను నిర్వహించడం కోసం, పారిశుధ్య నిర్వహణకోసం 13వ ఆర్థికసంఘం అందిస్తున్న నిధులు రూ. 562 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.

13. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కార్యక్రమంతో పాటు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన రహదారులను బిటి ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. 2013-14 లో 635.95 కిలోమీటర్ల మేరకు రూ.204.39 కోట్ల వ్యయంతో 346 పనులు చేపట్ట బడ్డాయి.

74. ఎమ్ఆర్ఆర్, 13వ ఆర్థికసంఘం నిధులు, సిఆర్ఆర్ మరియు ఆర్‌డిఎఫ్ కార్యక్రమాల కింద సమకూరుతున్న నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టడం జరుగుతున్నది.

26