పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53. 2014-15 లో రూ. 100 కోట్ల మేరకు కేంద్రప్రభుత్వ సహాయం తో కృష్ణా, అనంతపురం జిల్లాలలో మెగా టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. వీటితోపాటు శ్రీకాకుళం, గుంటూరులలో కొత్త టూరిజం సర్యూట్లు, శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో, పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రీసార్ట్ అభివృద్ధికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

54. కళలు, హస్తకళలు మరియు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని పునరుద్ధరించి, ప్రోత్సహించడం కోసం కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో శిల్పారామాలు నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది.

55. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తిరుపతిలో రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో ఇండియన్ కులినరి ఇనిస్టిట్యూట్, రూ. 117 కోట్ల అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లను నెలకొల్పడానికి ప్రతిపాదించడం జరిగింది. ఆ సంస్థల ద్వారా పర్యాటకరంగానికి సుశిక్షితులైన మానవ వనరులను అందించడం సాధ్యమవుతుంది. అంతేకాక ఒక్కొక్కటీ రూ. 12 కోట్ల అంచనా వ్యయంతో తిరుపతిలో, కాకినాడలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్లు నెలకొల్పబడుతున్నాయి. అంతేకాక మరికొన్ని ముఖ్య పర్యాటక ఉత్పత్తులకు సంబంధించి పిపిపి పద్ధతి ద్వారా ప్రైవేటు రంగం పెట్టుబడులను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

56. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.113 కోట్లు ప్రతిపాదించడమైనది.

21