పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరిజన సంక్షేమం

33. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా 26.31 లక్షలు. వీరు రాష్ట్రజనాభాలో 5.33 శాతం ఉన్నారు. మొత్తం 35 గిరిజన తెగలు ఉండగా వారిలో 6 తెగలను ప్రత్యేకంగా బలహీన గిరిజనతెగలు (పిటిజిలు) గా గుర్తించడం జరిగింది.

34. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి ఆర్థికపరమైన, విద్యాపరమైన సమానతతో పాటు మానవ వనరుల అభివృద్ధి మీద దృష్టి పెట్టి వారి సత్వర అభివృద్ధి సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక, గిరిజన ఉపప్రణాళిక చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

35. గిరిజనప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల విద్యాభివృద్ధి ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్యలక్ష్యాల్లో ఒకటి. గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్లో దాదాపు 70 శాతం విద్యాకార్యక్రమాల అమలుకే కేటాయించడం జరిగింది.

36. 13వ ఆర్థికసంఘ వారి సహకారంతో మారుమూల గిరిజనప్రాంతాల్లో వివిధ గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడం, నాబార్డ్ సహాయంతో రహదారుల నిర్మాణం కూడా శాఖ చేపడుతున్నది.

37. ఈశాఖకు 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.1150 కోట్లు ప్రతి పాదించడమైనది.

16