పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైనారిటీ సంక్షేమం

66. ఈ ప్రభుత్వం వక్స్ బోర్డుకు చెందిన స్థిర, చరాస్తుల సర్వే నిర్వహించి, అట్టి ఆస్తులను మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేలా చూడటానికి స్థిరాస్తుల రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది.

67. ఇమామ్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ. 10,000/-లకు మరియు మౌజామ్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.5,000/-లకు పెంచాలని ప్రతిపాదించడమయింది. అదే విధంగా పాస్టర్లకు నెలకు రూ.5,000/-ల గౌరవ వేతనాన్ని కల్పించాలని కూడా ప్రతిపాదించడమయింది.

68. బడ్జెట్లో చేర్చిన వివిధ పథకాల క్రింద మైనారిటీల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం రూ.2,106 కోట్ల మొత్తాన్ని సమకూర్చాలని ప్రతిపాదించడమయింది.

69. బిసి, ఎస్‌సి, ఎస్‌టి మరియు మైనారిటీ సామాజిక వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు మున్నగువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఒక బిల్లు తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వారి ఆర్థిక ఔన్నత్యం కోసం అన్ని నామినేటెడ్ మరియు కాంట్రాక్టు పనులలో 50 శాతం రిజర్వేషను ఉంటుంది.

కాపు సంక్షేమం

70. మేనిఫెస్టో వాగ్దానం ప్రకారం, కాపు సామాజికవర్గ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నేను రూ.2,000 కోట్ల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

25