పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110. కోవిడ్-19 మహమ్మారి మూలంగా ఆర్థిక వ్యవస్థ మందగించినందువల్ల 2020-21 బడ్జెటు అంచనాలు, 2019-10 బడ్జెటు అంచనాలు కన్నా 1.4 % తరుగుదల చూపిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ లోటు రూ. 18,434.14 కోట్ల మేరకు ఉండవచ్చునని, ఆర్థిక లోటు దాదాపు రూ.48,295.58 కోట్లు ఉండవచ్చునని అంచనా వేయటమైనది. రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో ఆర్థిక లోటు 4.78% గానూ, రెవెన్యూ లోటు 1.82% గానూ ఉండవచ్చును.

ముగింపు మాటలు

111. అధ్యక్షా!


2019-20 ఆర్థిక సంవత్సరం మన ప్రయాణంలో తొలి అడుగు మట్టుకే. మనం మన మాతృభూమిని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్జ్వల భవిష్యత్ దిశగా నడిపించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల క్రియాశీలక నాయకత్వంలో మన ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడం, మానవాభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలపడం కన్నా మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు.

112. 5 కోట్ల జనంతో కూడిన మన రాష్ట్రమనే కుటుంబ ఆకాంక్షలను నిలబెట్టడానికి మనం శాయశక్తులా కృషిచేస్తూనే ఉందాం. మన లక్ష్యాలను సాధించుకోవడానికి, మన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, మన రైతులకు బాసటగా నిలబడడానికి, మన ఆడబిడ్డలకు, తల్లులకు, అక్క చెల్లెళ్లకు సాధికారికత పొందడానికి, అస్వస్థులకు, రోగులకు అవసరమైన సంరక్షణ కల్పించడానికి, అణగారిన వర్గాలను అభ్యున్నతి పథంలో నడిపించడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడడానికి మనం చేయవలసినదం

41