పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్మశాన వాటికలు, పాఠశాలలకు ప్రహరి గోడలు, ఉద్యాన క్షేత్రాలు, పార్కులు, ఆట స్థలాలు, డిబియం రోడ్లు వంటివి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద మా ప్రభుత్వం చేపడుతుంది.

115. మా ప్రభుత్వం, 25 వేల కిలోమీటర్ల అంర్గత రహదారులను ఇప్పటికీ పూర్తిచేసి మరో ఎనిమిది వేల కిలోమీటర్ల రోడ్లను చేపట్టింది. అన్ని గ్రామాలలోను రాబోవు 2 సంవత్సరాలలో సి.సి. రోడ్లతో అనుసంధానిస్తాము. 2,666 నివాస ప్రాంతాలకు 2,599 కోట్ల రూపాయలతో బి.టి. రోడ్లు ఏర్పరిచాము. మిగిలిన 10,755 నివాస ప్రాంతాలను 2020 నాటికి పూర్తిచేస్తాము.

116. చంద్రన్న కాంతి పథకము ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధిక సంఖ్యలో LED బల్బులను ఏర్పరచింది. ఇప్పటికి 21.21 లక్షల LED బల్బులను ఏర్పాటుచేశాము. ఇవి 1138 కోట్ల విలువచేసే 1,181 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదాచేసింది.

117. జూలై 2018లో మన రాష్ట్రం ODF హోదాను సాధించింది. ప్రజల భాగస్వామ్యంతో 4116 ఖర్చుతో 38.64 లక్షల IHHLలను నాలుగున్నర సంవత్సరాల స్వల్పకాలంలో నిర్మించాము.

118. 2014 నుండి 6,10,711 వ్యవసాయ చెరువులను 1,647 వ్యయంతో నిర్మించాము, ఇంత పెద్ద సంయలో వ్యవసాయ చెరువులు ఉన్న రాష్ట్రం మనదే.

119. గ్రామీణ నీటి సరఫరా: 2024 నాటికి గ్రామీణ ప్రాంతాలలోని గృహనికి తగినంత నీటిని సరఫరా చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం, దీని కొరకు దాదాపు 22000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులను టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్.టి.ఆర్. సుజల పథకం క్రింద త్రాగునీటి నాణ్యత లోపించి ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో నీటి శుద్ధీకరణ ప్లాంట్లును స్థాపించి నాణ్యమైన త్రాగు నీరు అందుబాటులోకి తీసుకురావలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని కొరకు 103 క్లస్టర్లతో 7787 నివాస ప్రాంతాలను గుర్తించడం జరిగింది.

120. ఇంధన మౌలిక వనరులు: గత నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం రెట్టింపు అయింది. అనగా 9529 మెగావాట్ల నుండి 19,680 మెగావాట్లకు వ్యవస్థాపిత సామర్థ్యం పెరిగింది. పునరుత్పాదక ఇంధన రంగంలో 36,604 కోట్ల పెట్టుబడితో, 13000 మందికి ఉపాధి కల్పించేటట్లుగా వివిధ ప్రాజెక్టుల స్థాపన జరిగింది. ఇవి వివిధ దశలలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి. మా ప్రభుత్వం కృషివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ లోటు నుండి బయటకి వచ్చి మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అవతరించడమే కాక 100 శాతం విద్యుదీకరణను సాధించింది. ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రోజుకు 7 గంటల ఉచిత విద్యుత్, మిగతా రంగానికి 24X7 నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతున్నది.

121. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 999 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వ్యవసాయ, గృహ వినియోగదారులకు ఎటువంటి సుంకం పెంచలేదు. మా ప్రభుత్వం

22