పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎకరాలు సమకూరడం ఎన్నో ప్రశంశలకు కారణమైంది. ఈ విధానం అంతర్జాతీయ బిజినెస్ సూళ్ళలో ఒక కేస్ స్టడీగా మారింది.

110. అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు మొత్తం 1,09,023 కోట్లుగా అంచనా వేయబడింది. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 39,875 కోట్ల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయి. సచివాలయము మరియు శాఖాధిపతుల సమీకృత కార్యాలయము ఐదు టవర్లుగా నిర్మింపబడుతూ, అక్టోబరు 2020 నాటికి పూర్తవుతుంది. శాసనసభ్యులు వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మితమవుతున్న 3840 ఫ్లాట్లు ఈ సంవత్సరంలోనే పూర్తిచేసేందుకు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కళాత్మకమైన వంతెనను అమరావతికి అనుసంధానించడానికి ఇటీవలే పవిత్ర సంగమం వద్ద వంకుస్థాపన చేశాము.

111. విద్య, ఆరోగ్య కేంద్రంగా అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీ.ఐ.టి., ఇస్.ఆర్.ఎం. అమృత విశ్వవిద్యాలయం, ఎక్స్. ఎల్.ఆర్.ఐ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డజైన్లతోపాటు మరో ఎనిమిది విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి. ఇండో-యు.కె ఆసుపత్రులు, బి.ఆర్. షెట్టి హాస్పిటల్స్, బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ ఐ ఆన్స్టిట్యూట్ వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థలను మన అమరావతి ఆకర్షిస్తోంది.

112. అమరావతి మెరైన్ ప్రాజెక్టు భారత దేశంలోనే పెద్ద మెరైన్ ప్రాజెక్టుగా, పర్యాటక గమ్యంగా మారుతుంది. వివిధ ఐదు నక్షత్రాలు, నాలుగు నక్షత్రాల హోటళ్ళు, హిల్టన్, క్రౌన్ ప్లాజా, Novatel, Holyday Inn, GRT, Green Park, Daspalla వంటి ఐదు నక్షత్రాలు, నాలుగు నక్షత్రాల హోటళ్ళకు ఇప్పటికే స్థలాలు కేటాయించాము. Marriott, ITC, TAJ వంటి సంస్థలకు స్థలాల కేటాయింపు పరిశీలనలో ఉంది.

113. పట్టణ మౌళిక సదుపాయాలు గత నాలుగున్నర సంవత్సరాలలో 4,707 కోట్లు వెచ్చించి వివిధ పట్టణాభివృద్ధి కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపట్టింది. 68,084 కోట్ల ప్రాజెక్టు విలువలతో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. గత నాలుగున్నర సంవత్సరాలలో 8,858 కి.మీ.ల రోడ్లు, 668 MLD ల మంచినీటి సరఫరా, 206 MLDల మురుగునీరు సామర్థ్యము తోడయ్యాయి. 3,055 కిలోమీటర్ల మురుగునీటి కాలువలు 2381 కిలోమీటర్ల వరదనీటి కాలువలు వేశాము. విజయవాడ, కాకినాడ, తిరుపతి మరియు అమరావతితోపాటు శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం కర్నూలు, ఏలూరులను కూడా సుందర నగరాలుగా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది.

114. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి పథకము ద్వారా వచ్చే నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానించి అనేక ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలను గ్రామీణ ప్రాధమిక, మౌలిక సదుపాయల అభివృద్ధికి మా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ అనుసంధానము ద్వారా బడ్జెట్ కేటాయింపులు 750 కోట్ల నుండి 1000 కోట్లకు పెరిగాయి. పంట సంజీవని, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడ వాడలో చంద్రన్న బాట, ఘన వ్యర్థాల నిర్వాహణ, అంగన్ వాడీ కేంద్రాలు, Soak pits బీటీ రోడ్లు, గోకులములు,

21