పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105. టూరిజం (పర్యాటకం): వివిధ రంగాలలో మాదిరిగానే, పర్యాటక అభివృద్ధి మరియు పర్యాటక వసతుల కొరకు పర్యాటక శాఖలోనూ మా ప్రభుత్వం ఒక టూరిజం పాలసీ తీసుకు వచ్చింది. దీని ద్వారా రాష్ట్రానికి 5300 కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపం దాల్చడంతో పాటు దాదాపు 2500 ఉద్యోగాలను కల్పించగలిగాము. ఈ రంగములో మా అడుగులు రాష్ట్రాన్ని దేశములోనే 3 వ స్థానములో నిలిపింది. ఈ రంగములో సాలుకు సరాసరి 15 శాతం అభివృద్ధిని సాధిస్తున్నాము. ఈ రంగంలో సాధిస్తున్న సమగ్ర పర్యాటక అభివృద్దికి గాను, భారత ప్రభుత్వము మన రాష్ట్రానికి 2017 మరియు 2018 సంవత్సరాలలో రెండుమారులు అత్యుత్తమ రాష్ట్ర అవార్డును అందించింది. 2014లో ఉన్న 6,000 హోటల్ గదులను 10,000కు పెంచడం ద్వారా ఈ నాలుగున్నర సంవత్సరాలలో వసతి గదులను రెట్టింపు చేయగలిగాము. ఏప్రిల్, 2019 నాటికీ మరో 2,500 గదులను కూడా అందుబాటులోకి తేబోతున్నాము. 5 నక్షత్రాల హోటళ్లను కూడా 6 నుంచి 10కి పెంచగలిగాము.

మౌలిక సదుపాయాల అభివృద్ధి

106. నీటి వనరుల యాజమాన్యము: వ్యవసాయము మరియు రైతుల అభివృద్ధికి నీటిపారుదల జీవనరేఖగా మా ప్రభుత్వము నమ్ముచున్నది. ఇప్పటివరకు 64,334 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కొరకు ఖర్చుచేయుట జరిగినది. గౌరవ ముఖ్యమంత్రిగారు పోలవరం ప్రాజెక్టును ప్రతివారము వ్యక్తిగతముగా పర్యవేక్షించుచున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టిన 15,587 కోట్ల రూపాయలలో 10,499 కోట్ల రూపాయలు 2014 సంవత్సరం తర్వాత ఖర్చు చేయుట జరిగింది.

107. పోలవరం ప్రాజెక్టు ముందస్తు ప్రయోజనాలు పొందుటకు ప్రభుత్వము గోదావరి జలాలను కృష్ణా నదిలోకి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మళ్ళించుట జరిగినది. ఇప్పటివరకు గోదావరి నుండి 268 టి.ఎం.సీల నీటిని కృష్ణా నదిలోకి మళ్ళించుట జరిగినది. పోలవరం ప్రధాన ఎడమ కాలువ నుండి గోదావరి మరియు ఏలేరు నదులు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీంను ప్రారంభించుట జరిగినది. వంశధార ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్ స్కీం, పులిచింతల ప్రాజెక్ట్, తెలుగుగంగ ప్రాజెక్ట్ మరియు వెలిగొండ ప్రాజెక్ట్‌లను క్రమపద్ధతిలో పూర్తిచేసి అతివృష్టి/అనావృష్టిల వలన కలుగు ఇబ్బందులను వీలైనంత తక్కువ స్థాయికి తగ్గించుటకు ప్రభుత్వము కృతనిశ్చయముతో ఉన్నది.

108.మిగులు నీటిని వృధాగా కాకుండా బదిలీచేయడానికి రాష్ట్రంలోని అనుసంధానించే మహా సంగమం ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. నీటి పరిరక్షణకు, త్రాగునీరు లభ్యతకు కరువు నివారణకు పరిశ్రమ అభివృద్దికి ఈ అనుసంధానం ఎంతో దోహదపడుతుంది. ఇప్పటివరకు మా ప్రభుత్వం ఈ రంగంపై 64,334 కోట్లను ఖర్చుచేసింది.

109. ప్రజా రాజధాని, అమరావతిని ప్రపంచంలోనే ఐదు ఉత్తమ నగరాలలోనే ఒకటిగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. స్వచ్ఛంద భూసమీకరణ పథకం ద్వారా 28,074 రైతుల నుండి 34,010

20