పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగము 2019-20.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలంలో పింఛన్లను 10 రెట్లు పెంచినట్లు అయ్యింది.

76. ప్రజా పంపిణీ వ్యవస్థ - కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే లబ్ది చేకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వ 24 లక్షల కొత్త కార్డులను జారీ చేసి, ఈ వ్యవస్థలో అదనంగా 1.52 కోట్ల మందిని పరిధిలోకి చేర్చింది. వలసల ద్వారా కానీ, మరే ఇతర కారణంగా ఏ కుటుంబము రేషన్ కోల్పోకుండా రాష్ట్రంలోని ఏ చౌకదుకాణం నుండైనా రేషన్ తీసుకునే అవకాశాన్ని కలగ చేసాము. తద్వారా రేషన్ డీలర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వం, జవాబుదారీతో పాటు కార్డుదారులు వారి సౌకర్యాన్ని బట్టి వేరే దుకాణాన్ని ఎన్నుకునే వీలు కుదిరింది.

77. దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల్లో ఆరోగ్య ప్రమాణాలు, పోషకాహార అలవాట్లు మెరుగు పర్చడానికి 2018 అక్టోబరు నుంచి అన్ని జిల్లాల్లోనూ బిపిఎల్ కార్డు ఉన్నవారికి 3 కిలోల రాగులు, 2 కిలోల జొన్నలు ఇవ్వడం జరుగుతుంది. ఐరన్ లోపంవల్ల కలిగే నిడివైన రక్తహీనతను అరికట్టడానికి ప్రతి బిపిఎల్ కార్డుపై డబుల్ fortified ఉప్పును పంపిణీ చేయటం జరుగుతుంది.

78. PDS లకు అదనంగా, పేద ప్రజలకు పరిశుభ్రమైన, సరసమైన ఆహారాన్ని, అందించాలని అన్న క్యాంటిన్లను ప్రారంభించటం రూ.5/-లకే ఒక భోజనాన్ని ఇవ్వడం జరిగింది. 175 అసెంబ్లీ నియోజిక వర్గాలకుగాను 368 క్యాంటీన్లను మంజూరు చేయటం జరిగింది. ఇప్పటికి 216 పట్టణాలలో, 152 గ్రామీణ ప్రాంతాలలో మొత్తు 160 క్యాంటిన్లు, 4 కార్పొరేషన్లతో, 14 మునిసిపాలిటీలలో పనిచేయటం మొదలు పెట్టాయి.

79. మహాత్మాగాంధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం: 2018-19 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన లక్ష్యం 22 కోట్ల పని దినాలు కాగా మనం ఇప్పటికే 2019 కోట్ల పనిదినాలు నమోదు చేసాము. దీంతో 65.96 లక్షల వేతనకారులు, 40.81 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం క్రింద ఇప్పటివరకు 7,437 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది. ఇందులో 4,034 రూపాయలు వేతనాలకు, 3,091 కోట్ల రూపాయలు మెటీరియల్స్ కు వెచ్చించటం జరిగింది.

80. చంద్రన్న బీమా: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కలిగించే పథకం. దీనిద్వారా వివిధ రకాల బీమాలు ఉపకారవేతనాలు అందించటం జరుగుతుంది. ఇప్పటివరకు 2.6 కోట్ల కార్మికులకు ప్రతి సంవత్సరం సహాయం అందించాము. 2018-19లో 9 లక్షలు రైతులకు రైతు బీమా ప్రారంభించాము. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7 కోట్ల రూపాయలు చెల్లించాము. ఈపథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచుతాము. ఈపథకానికి కేటాయింపులను 2.5 రెట్లు పెంచుతూ 354 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను.

81. హౌసింగ్ పథకం క్రింద వివిధరకాలుగా ప్రోత్సాహకాలను పెంచాము. ఋణ పరిమితిని కూడా తగ్గించాము. 31,793 కోట్ల రూపాయలతో 15.78లక్షల గృహాలను మంజూరుచేసాము. పెండింగ్‌లో

15