పుట:అశ్వలక్షణసారము (మనుమంచిభట్టు).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గదిసిన శేఫశి వాజికి
పదపడియు న్నుభయపార్శ్వబాసట యుండున్.


సీ.

పాసలంబుకు క్రింద భాసిల్లు రోహిణి
             సంధుల గుదము పార్శ్వములయందు
సృక్సిందయుగళంబు చెలువొందు నూరువుల్
             వానితో నడ్డము వానిమ్రోల
తగమోహమున గండపార్శ్వంబు లూరువు
             ల్వక్కకుక్తులు నిల్చు వానిమీద
నెదరి వక్రకుక్తుల నిజమధ్య హరికిని
             రెండుపాతంబులై యుండుకొలది
స్థూల మొప్పారు వక్త్రమౌ శుక్తులకును
వానికి్రిందటను దిరద్వయము వెలయు
నాది వినినట్లు ముందరిపాదములకు
రాజనుదారనౌభళ రాజకంప.

27

ప్రవాలలక్షణము

క.

కరమూలకకుడములకును
ఖరకుప్పిక జానుదేశకూర్పంబులకున్
పరిమితిమారంగుళములు
పరికింపగ గంపభూప బంధునిధానా.

28


క.

కాలవని గళస్తముల
పొడవును యంగళము మొగి దంష్ట్రములన్
చెలువుగ జూడగ నొప్పును
తలపంగా నృపసమూహ ధరణీనాథా.

29


చ.

విసవిసనైన తాలుదళవీథియు నాలుగయు న్హయంచు కున్
బొసగిన యంగుళంబులని ముప్పదిరెండు గడంగ