పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శక్తిని ఉత్సాహాన్ని శేరణను ౦ఎచ్చి ఎంతో జనావరణళు పాత్రుదయ్యారు.

న్వరాజ్యము, జాతీయత, హాందూత్వము, నిజమైన స్వాతంత్ర్రమూ అంటే ఏమిటో ప్రచారం చేయడానికి నాగపూరులోనే “స్వాతంత్ర్య, అనే దినపత్రికను ప్రారంభించి కొన్నాళ్ళు పత్రిక ద్వారా ప్రచారం సాగించారు. అయితే, ప్రభుత్వం ఈ పత్రికపై ఆంక్షలు విధించి, ఆటంకాలు కలిగించడంతో పత్రికా ప్రచురణ ఆగిపోయింది.

భారత జాతీయ కాంగ్రెసు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్‌కి, జాతి నిర్మాణంలో కాం[గైసు అనుసరించిన విధానాలు, రాజకీయాలు నిరాశను కలిగించాయి. 1923లో హిందూ, ముస్లింల మధ్యచోటు చేసుకున్న విద్వేషాలు, అల్లర్లు ఆయనను ఎంతో కలచివేసాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్‌, వినాయక దామోదర సావర్శ్మారు, బాబూరావు సావర్మారు మరియు ప్రధానంగా బీ.ఎస్‌.మూంజే మొ॥ వారి ప్రభావం వారిపై పడింది. వీఠరసావర్మ్శారు ప్రతిపాదించిన “హిందూత్వ” సిద్ధాంతం ప్రభావంకూడా ఆయనపై విపరీతమైన ప్రభావం చూపింది. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు, సంస్థల కార్యక్రమాలు, రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు అన్నిటినీ అధ్యయనం చేసారు. మాతృభూమియైన భారతవర్షం వైశాల్యంలో, జనసంఖ్యలో, సృష్టి సౌందర్యంలో, ఖనిజసంపత్తిలో, పాడిపంటలలో, యివిగాక వేదాంతం, ధర్మం, సంస్కృతి, చరిత్ర, విద్య, పరాక్రమం, కళాకౌశల్యాదుల్లో ఎంతో ముందుండిన హిందూ రాష్ట్రం ఎందుకు ఈ విధంగా వెనుకబడింది అనే ఆలోచన ఆయనను వేధించసాగింది. ఆవేదన నుంచి ఒక నూతన మార్గాన్ని అన్వేషించాలనే సంకల్చం ఆయనలో చోటు చేసుకుంది. భారత జాతీయత, హిందూ సంస్కృతి మరియు వారసత్వం మూలాధారాలుగ ఉందడవలసినదేననీ గాఢంగా నమ్మారు. హొందూత్వమే యధార్ధ భారత జాతీయత” అనే సిద్దాంతం డాక్టర్‌జీ ఆలోచనలలో దృథంగా పాతుకుపోయింది. “హిందూ రాష్ట్రాన్ని సముద్దరించాలని, ఆ ధ్యేయం నెరవేరటానికి నివురుగప్పిన నిప్పులా చేయటానికి * రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌” ను ఒకరాష్ట్రీయ సంఘటనోద్యమంగా ప్రారంభించారు.

మహాపురుషులకు క్రియాసిద్ధి 'సత్త్వ' మనే మహత్తరగుణంతో లభిస్తుంది; ఉపకరణాలవలన కాదు- అని పండితులు చెప్పిన లోకోక్తి దాక్టర్‌ జి విషయంలో ప్రత్వక్ష ఉదాహరణ. నాగపూరులో వీజమెత్తిన సంఘ వృక్షం, కాలక్రమేణ అన్ని జిల్లాలకు, నెమ్మదిగా దేశం నలుమూలలకు శాఖోపశాఖలుగ విస్తరిల్లింది. సంథు సభ్యులు అందరూ (క్రమం తప్పక ప్రతినీత్య్వమూ నిర్ణీత సమయానికి సంఘ స్థానానికి వచ్చి, సరియైనవేళకు (భగవ) దధ్యజారోహణ (కాషాయ జెండా) చేసి మాతృభూమి ప్రార్ధన చేయాలనే కఠిన నియమం పాటించే సంన్కృతిని పాటించటం నంవుం ప్రత్యేకత. సంథుం ఒక వ్యాయామశాలయని కొందరు, న్వచ్చంద సేవక దళం అని సేవాసమితి అనీ, కొందరు విప్లవ సంఘమని రకరకాల అపోహలను ఎదుర్కోవలసి వచ్చింది. అన్ని అవరోధాలను, నిషేధాలను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్శొని, స్వీయ సిద్ధాంతాల నుంచి అంగుళం మేరకూదా చలించక, సంఘ కార్యక్రమాలను ముందుకు నడపటంలో దాక్టర్‌ జీ కృతకృత్యులయారు.

సంఘ్‌ స్థాపించిన తర్వాత వివిధ కార్యక్రమాలలో, సందర్భా అలో సంఘ కార్యకర్తలతో సమావేశం అయినపుడు, ముఖ్యంగా 1985వ సం॥లో (అప్పటికి సంఘం స్థాపించి పదిసం॥లు అయింది) చేసిన ప్రసంగాలు ఎంతో ఉత్తేజకరంగాను, స్ఫూర్తిదాయకంగాను, హిందూ సమాజానికి సంజీవనీ వలె ఉండటంతోపాటు హిందూత్వ ఖావోద్వేగాలను రేకెత్తించేవిగా ఉందేవి. హిందూస్సాన్‌ హిందువులది; శివాజీ నుండి (మేరణ పొందుదాం; ఎందుకంటే అతడు హొిందూసమాజానీకి ఆదర్శంగా నిలిచే ఏకైక మహాపురుషుడు, హిందూ ధర్మాన్ని పాణం పోయినా, అఖరినెత్తుటి బొట్టు వరకు వదలిపెట్టకూడదు. వమనలనువునం సంరక్షించుకోవాలన్నా, ఇతురులలోని ఆక్రమణ (ప్రవృత్తిని తాలగించాలన్నా మనం శక్తిమంతులం కావలసి ఉంటుంది. స్వరాజ్యం బీచ్చమెత్తితే వచ్చేది కాదు, సంపాదించుకునేది; జీవితమంతా సంఘకార్యం చేయదలు చున్న వారు కూడా చదువుకోవడం, తద్వారా సంవుం పని చేయదానికి యోగ్యతను అధికారాన్ని సంపాదించుకోవడం అవసరమే, యిలా సాగేవి దాక్టర్‌జి ప్రసంగాలు. ఈవిధంగా సంఘకార్యమే జీవిత లక్ష్యంగా, దైనీక జీవితం అంతా ప్రతి నిమిషం సంఘానికే వినియో గించి, నీరాడంబరంగాను, ప్రచారాలకు దూరంగాను, అపారమైన ధీశక్తి అసమానము గంభఖీరము అయిన నీతిజ్ఞత, అచంచలమైన ధైర్యం మూర్తీభవించిన దాక్టర్టీ తన జీవితమే ఒక మహాయజ్ఞంగా ఆహుతిచేసి, హిందూ రాష్ట్రానికి ఒక అపూర్వమైన వెలుగుని, నూతన దృష్టిని నృష్టించి- హిందూరాష్ర్రం (భరతఖందం/ఆర్యావర్తం) చరణాలపై కానుకగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ ను అర్చించిన దాక్టజీకి 1932 నుండీ ఆరోగ్యం క్షీణించి దీర్జకాలిక చికిత్సలు పొంది, చివరకు1940సం॥ జూన్‌ 21నాడు - స్వర్గస్థులైనారు.

1940లో దా॥ హెర్టేవార్‌ మరణించిన తర్వాత వారి జీవితాన్ని సంక్షిప్తంగా పరిచయం చేనిన పుస్తకం హిందీలో వెలువడింది. తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకం 1971లో మొదటిసారి ముద్రింపబడింది. ఆ తరువాత్త 1985వ సం॥॥లో సంఘం స్థాపించి దశాబ్టి ఉత్సవాలు జరిపినపవుడు దాక్టర్‌ జీ ప్రసంగం, 2003లో హిందీలో ప్రచురితమైన “దా. కేశవబలిరాం హెద్దేవార్‌” (నవభారత నిర్మాతలు” (గ్రంధావళిలో భాగంగా) [గ్రంధంనుండి 'రాజద్రోహానికి నేరవిచారణ” ను ప్రత్యేక అనుబంధంగా తెలుగులోకి 2004లో వడ్డి విజయసారధి అనువాదం చేసారు. ఈ విధంగా 'దాక్టర్‌” జీవితం- సందేశం, దానితోపాటు చేర్చిన కొత్త అధ్యాయాలతో 2018లో నవయుగ భారతి ప్రచురణలు, హైదరాబాదు వారు తమ ప్రధవు ముదణగా వెలువరించారు. దేశభక్తి ఖావనలను 'ప్రజ్వలింపచేయుటలో ఈ (గ్రంధానికి ప్రాముఖ్యం ఉంటుందని తక్కువ ధరకే అందజేస్తున్నారు.

- ఎం. వి.శాస్త్రి

94413429