పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉచ్చారణా విధానంగురించీ విపులంగా చర్చించారు. ప్రకాశంగారు ఇంతకుముందు ఇతరులు గమనీంచనీ ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. అదేమిటంటే, తెలుగులో నందులు సాధారణంగా స్థానాశిత వర్గీకరణపై ఆధారపడి జరుగుతాయని ఇప్పటివరకూ నమ్ముతున్నాం. ఆయిత్తే త్‌-ల్‌ మధ్య త్‌-న్‌ మధ్య సంధి జరగక పోవడం, భిన్న వర్ణాలకు చెందిన టొ-ల్హ్‌ ద్‌-ల్మ్‌ ట్‌-న్‌, ద్‌-న్‌ మధ్య జరగడం, అలాగే టొ-చ్‌, ట్‌-జ్‌, డ్‌-చ్‌, ర్‌-జ్‌ల మధ్య జరగడం, ఇంకా స్‌-త్‌ ల మధ్య సంధి జరగడాన్ని నిశితంగా పరిశీలించి వర్ణాల వర్గీకరణ స్థానాలపై ఆధారపడినాగానీ దానీకీ వర్షప్రవర్తనకూ ఎలాంటి సంబంధం లేదంటారు. అందుకనీ ప్రకాశంగారు కరణాటశిత వర్గీకరణపై ఆధారపడి సంధి సూత్రాలను ప్రతిపాదిస్తారు. ఉదాహరణకు, ప, బ, మ, (వు ఓపష్టాలుగానూ, తదృస, చ, జ (య) లను జిహ్వోపాగ్రాలుగానూ, ట, డృ న ణ, ల, ళర లను జిహ్వాగ్రాలుగానూ, క, గ లను జహ్వమూలీయాలుగానూ వర్గీకరించి సంధి కార్యాలను సూత్రీకరించటం తేలిక అని సోదాహరణంగా నీరూపిస్తారు. వారు ఇచ్చిన వివరణ ఇప్పటికి ఇదే మొదటిసారి. వారు చెప్పిన సూత్రం: “జివ్వోగ్రాలు సంధికి పూర్వంలో ఉన్నప్పుడు వరంలో ఉన్న జిహ్వోపా[గాలతో కరణం విషయంలో సమీకృతమౌతాయి”. ఉదా. చూ.: పాల్‌[+జిహ్వాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ్ర) ఓ= పాల్ష్‌[+జిహ్వోపాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ]) ఓ= ప్లాల్లో

అలాంటిదే, జిహ్వాగ్రాలు పరంలో ఉన్న పరివేష్టిత జిహ్వాగ్రాల కారణంగా పరివేష్టితాలు అవుతాయి. ఉదా. పాలు+వబ్బా = పాళ్దబ్బా.

పై సూత్రం ప్రవర్తిల్లి పరంలో ఉన్న స్పర్శేతర హల్లు ముందుగా పరివేష్టితంగా మారుతుంది. ఆ పైన పూర్వ స్పర్భం వర హల్లు నుండి అనునాసికతనూ పార్చికతనూ పొందుతుంది.

అంటే బడి+ని ౫ బద్‌+జి -* బత్‌+ణీ అవుతుంది.

తెలుగు సంధి నియమాలకు వర్ణాల స్థానాశ్రిత వర్గీకరణ కంటే తరణా్యశిత వర్గీకరణ వబఖ్యవబా ఉవయోగకతరమూ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించి సోదాహరణంగా నీరూపిస్తారు.

అలాంటిదే ఏరు, నూరు, మోకాలు లాంటివి ఏటి, నూటి, మోళాటి కావడం కరణా(శిత వర్షం కావడమే నంటారు. అలాంటివే నూయి-టనూతి, చేయి-టచేతి కావడంకూదా అంటారు. కారణం, య, తలు జిహ్వోపాగ్రానికి చెందటం అంటారు. కానీ ఈ వివరణ ఇట్లా సంధి జరిగినవాటి గురించి చెబుతుంది సరేగానీ సంధి జరగనీవాటిగురించి ఏం చెబుతుంది. నేటి తెలుగులో పదాంతాలలో ను, లు, రు, యి ఉండి సంధిలో ఎలాంటి మార్పు పొందనివే కోకొల్లలు. అంటే చారిత్రికంగా ధ్వనులలో వచ్చిన మార్పులవలనే నేడు సంధి కార్వాలలో విరళంగా కనబడుతున్నవీ సామాన్య సూత్రాలకు లొంగనివీను.

అచ్చులమధ్య జరిగే మార్పులను స్వరమైత్రి అనీ, స్వర సమీకరణం అనీ అనడం ఆనవాయితీ. ఈ రచయిత వీటిని అచ్చుల మమత అంటున్నారు (ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న పారిభాషిక పదాలను వాడక కొత్తపదాల వాడుక ఎందుకో). రెండూ అంతకంటే ఎక్కువ వర్ణాలమధ్య జరిగే సంధి కార్యాలలో “త్రోడ్రి వర్ణాలను తాకే ధ్వన్యంశాలను” అలా కానివాటినుంచి వేరుచేసి వర్గీకరిస్తారు. వాటినే చరాంశాలూ న్టిరాంశాలుగా పేర్కొంటారు. అంటే ఒక వర్డానికి సంబంధించిన థధ్వన్యంశాలు మరో వర్షానికి గనక పాకితే వాటిని చరాంశాలు గానూ అట్లా పాకలేనీ ధ్వన్యంశాలను స్థిరాంశాలుగానూ చూడాలి అంటారు. ఇప్పటివరకూ తెలుగులో జరుగుతున్న స్వరసమీకరణంపై చే. రామారావుగారూ, క.వెం. సుబ్బారావు గారూ, నే నాగమ్మారెడ్డి, జె.వి. శాస్రిగారూ, గా. ఉమామహేశ్వరరావు వెొుదలైనవారు ఎందరో వివృలంగా చర్చించినా చరాంశాల ప్రతిపాదన ఇదే ప్రథమం.

కారక బంధాలు -విభక్తి వాడుకలు అనే ఏదవ అధ్యాయంలో ఇప్పటివరకూ ఎవరూ వాడని పారిభాషిక పదజాలం వాడుతూ తెలుగులో ఐదు రకాల వాక్యాలు ఉన్నాయన్నారు. వాటికి వరుసగా, గుర్తింపు వాళ్యాలు (అతను కోపిష్టి, వెందుడు వాక్యాలు (నాకు రెండు కార్లు ఉన్నై, మనోప్రవృత్తి వాక్యాలు (అతనికి ఇద్టీలంటే ఇష్టం), అస్తిత్వ వాళ్వాలు (డాక్టరుగారు ఉన్నారా?) కార్య వాళ్వాలు (అతను పరిగెత్తాడు, తలుపు తెరుచుకుంది) అని పేర్లు పెట్టారు. ఇవి పూర్తిగా వక్త అనుభవపూర్వకమైన వ్యక్తీకరణపై ఆధారపడి చేసిన విభజన. భద్రిరాజు కృష్ణమూర్తి, చేతళూరి రామారావు, మొదలైన వ్యాకర్తలు నీర్మితిని ప్రధానంగా తీసుకొని వాక్య విభజన చేశారని చెప్పాలి. అట్లాగే, రచయిత తెలుగు వాక్యాలలో ఉక్తం, ఆఖ్యాతాల తేదాను గుర్తించడం ముఖ్యమైనదని చెబుతూ, వివిధ వాళ్యాల్లోని తేడాలను ఉద్దేశ్య విధేయాల సంయోజనంగానే గుర్తిస్తారు. అయితే ఇదంతా వాక్వాలలో వివిధ రకాలను గుర్తించడం వరకే. అసలు, వాక్యాల అర్జ్భావగాహన వాక్యాలలో వాడిన నామబంధాల విభక్తి రూపాలవలన ఏర్పడుతుందని చెబుతూ ఎనఖైదాకా ఉన్న విభక్తి ప్రత్యయాలనూ ఉపపదాలనూ మొత్తం 37 రకాల అర్థ్ధపరకమైన నామసంబంధాలు గానూ మళ్లీ వాటిని 14 రకాల కారక సంబంధాలుగానూ విశ్లేషిస్తారు.

ప్రాణంతీయు లేక చంపు అనే క్రియలు సమానార్థకాలు అని మన సాధారణ నమ్మకం. అయితే అవి కావనీ వాటి వాడుక రుజువుపరుస్తోంది అని ఉదాహరణలతో చూపిస్తారు.

(18) ఆ విషం అతనీ ప్రాణం తీసింది.

(20) ఆ విషం అతనీనీ చంపింది.

20 వ వాక్యం బాగుండకపోవటానీకి కారణం చంపు అనే సకర్మక (క్రియా వ్యాపారానీకి కర్తృత్వం వహించలేకపోవటంగా కనబడుతోంది. మరి అదే విషం 18 వ వాక్యంలో ఎలా సాధ్యమైంది. ప్రాణం తీయడం, చంపడం రెండూ స్తూలంగా ఒకే అర్ధాన్ని స్ఫురిస్తున్నా వాటి అర్జకాలమధ్య తేడా కనబడుతోంది. ప్రాణంతీయడానికి కర్తృ పదాలు (ప్రాణులు కాకపోవచ్చుగానీ చంపడానికి కర్తృ పదాలు 'ప్రాణులైవుందాలనీ నీయమం తెలుగులో ఉందనిపిస్తోంది. క్రియా పదబంధాల గురించి 8 వ అధ్యాయం లో చర్చించారు. దీన్లో, కార్యన్సితీ (250609 కాలనూచనా (18%96) దెందూ 'ప్రత్యయాలతోనే తెలుస్తాయని చెబుతూ, “తెలుగులో ఉండు అనే క్రియ మాత్రమే కాలాన్ని సూచిస్తుంది” అనీ, ... “మిగతావన్నీ కార్య స్థితిని సూచిస్తాయి” అంటారు. ఇట్లా వీరిదే మొదటి ప్రయత్నం అనుకుంటాను. 97 వ పుటలో ఇచ్చిన పటానికి వివరణ ఇంకా ఉంటే బావుండేది.

ఇక 9వ అధ్యాయంలో నామ్బీకరణాలగురించి చేసిన చర్చ చేకూరి రామారావు (బేరా) గారి వ్రతిపాదనలపై నమీక్షా వ్యాసంలాంటిది. చేరాగారి ప్రతిపాదనలలో ఉన్న కొన్ని సమస్యలను పట్టుకొని చర్చించటం జరిగింది. భావ పరిశీలన అనే పేరుతో 10 వ అధ్యాయంకింద తెలుగు వాక్యాల అర్థ స్ఫోటన ఎలా జరుగుతుందో వివరించబూనటం ఒక విధంగా ఈ వ్యాకరణంలో ఉన్న కొత్తవనమే. | తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |