పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాటినీ పాతి ఉంచారు. ఒకచోట వీటిముందుగల ఐదారడుగుల గుంటలో నలుపు, నలుపు ఎరుపు కుంద పెంకులు కనీపించాయి. ఇనుపయుగంలో జనం ఒకచోట కుదురుగా ఉండటానికి గుడిసెలు వేసుకొని మరణించిన వారినీ గుంట సమాధుల్లో పాతి, గుర్తుగా వాటి పక్షనే ఇలా నిలువు రాళ్లను పాతి పెట్టే ఆనవాయితీనీ ఇవి తెలియజేస్తున్నాయి. చిత్రమేమిటంటే, పాతిన నిలువురాళ్లలో, చాలావరకు శిలాజాలను పోలి ఉండటం, కొన్నైతే పెద్ద పెద్ద చెట్లు ఘనీభవించి కొయ్యరాళ్లలా మారిపోయాయా అన్నట్లున్నాయి. గతంలో ఇలాంటి నీలువురాళ్లవద్ద జరిపిన తవ్వకాల్లో బయల్పడిన పురావస్తువుల విశ్లేషణ ద్వారా క్రీపూ. 1500 - 1000 సం॥ల మథ్యకాలాల నాటి మానవులు ఇలాంటి సమాధులు, నీలువు రాళ్లను ఏర్పాటు చేసుకొన్నారనీ చెప్పవచ్చు. వెల్లటూరు - గొల్లపల్లి నిలువురాళ్లు కూడా క్రీ.పూ. 1000నాటి ఇనుపయుగపు ఆనవాళ్లేనని రుజువైంది. చుట్టుపక్మబ ఉన్న ఆవూరి వాళ్లవగ్గరకెళ్ళి వీటి ప్రాచీనతను తెలిపి, పోయినవిపోగా ఉన్నవాటినైనా కాపాడుకోండి అనీచెప్పాం. “కంకర కావలసిన వాళ్లు ఈ నీలువురాళ్లను, పదేసి కొట్టుకుపోతున్నారు. ఆపేవాళ్లే లేరని వాళ్లు అక్కది నుంచి వెళ్లిపోయారు. యుద్దభూమిలో హోరాహోరీ పోరాడి నేలకొరిగిన వారు ఒరిగిపోగా, మిగిలి నిశ్చేప్టులై చూస్తున్న యోధుల్ని తలపిస్తున్నాయి- ఆ నీలువురాళ్లు.

సమయం ఉదయం 7.00 గంటలైంది. బయలుదేరి కనిగిరికి తిరిగొచ్చాం. కనిగిరిలోనీ చారిత్రక ఆనవాళ్లను వరుసగా చూపిస్తున్నాడు కరుణానిధి. కాందకింద గల ఆలయాలు, కోటగోడ, ద్వారాలను చూపించాడు. కాటమరాజు నిర్మించాడని చెప్పాడు. చారిత్రకాధారాల్ని పరిశీలిస్తే అద్దంకి రాజధానిగ పాలించిన ప్రోలయవేమారెడ్డి నిర్మించిన 84 దుర్దాల్లో కనిగిరి ఒకటని తరువాతి కాలంలో గజపతులు దీన్ని బలపరచి గిరిదుర్గంగా తీర్చిదిద్దారని, 'శీకృష్ణదేవరాయలు ఈ కోటను స్వాధీనం చేసుకాన్నాడని చంద్రమౌళిగారు చెప్పింది సబజేననివించింది.

కాండమీద కోటలో రెండు చెరువులు చెన్నమ్మక్మబావి అనే కోనేరు, అనేక శిధిలదేవాలయాలున్నాయి. కొండమీద కోటగోడను తిన్నగా లాగితే 25 కి.మీల పొడవున సాగుతుంది. ఈ కోటగోడలు, దర్వాజాలు, బురుజులు, గుళ్ళు, కట్టడాలను చూచి, మళ్లీ కాటమరాజే వచ్చి వీటిని బాగుచేయించుకుంటాదేమోనని సరిబుచ్చుకాన్నాం.

కోనేరు దగ్గర ఒక బండకు చెక్కిన ఒక 17వ శతాబ్ది ఆరుపంక్తుల శాసనంలో దాడింఠెడ్డి కుమారుడు, దారియినేని రెడ్డి రాబోయే ఒక ఆపద నుంచి తమను హనుమంతుడే రక్షించి కాపాడుతాడని ప్రార్ధిస్తున్న వివరాలున్నాయి. ఉదయం గం119.30 ని. అవుతుంది. ఆకలి దంచుకుంది. కనిగిరిలో మంచి హోటల్‌కుపోయి టిఫిను చేద్దామనుకునేలోపు నా ఫోన్‌ మోగింది. ప్రముఖ కవి, కథకుడు, చిత్రకారుడు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారిది. ఇక్కడే ఉన్నామన్స, టిఫిను చేసి కలుస్తామన్నా వినకుందా బలవంతపెట్టి వాళ్లింటి పక్కన ఒక కుటుంబం నడుపుతున్న వరంగల్‌ మట్టెవాడలాంటి పూటకూళ్లమ్మ గుర్తొచ్చేట్లున్న ఒక చావడి హోటల్‌కు తీసుకెళ్లారు. గరగరలాదే దోసె, దానీమీద సన్నగా చిన్నగా తరిగిన ఉల్లితానలు, కారెట్టుముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మరేదో ఫొడినీ కొంచెం కారాన్ని చల్లి తిరగేసి పెణంమీంచి తీసిన అట్టునీ తింటుంటే, రోజూ ఇక్కదే తింటే బాగుందనిపించింది. నంజుకాన్న కొద్దీ బలంపుంజుకునేట్టున్న వేరుశనగ చట్నీ అల్లం పచ్చడ్‌ మానసోల్లాసాన్ని కలిగించాయి ఆతిథ్యంలో భాగంగా టిఫిన్‌ను అందించిన వెంకటేశ్వరరెడ్డి గారికి నమస్మరించాం. ఇంటికి తీసుకెళ్ళి ఆయన కవితాసంపుటి “దుక్కిచూపు” నిచ్చి, తానువేసిన వర్ణచిత్రాలను చూపించాడు. వీడుకోలు తీసుకొని ఎక్కడికెళదామని కరుణానిధిని అడిగాం. పాలేటి గంగమ్మవాగు, వెంగళాపురం వెళదామనగా కారును అటు మళ్లించాం.

కనిగిరి నుంచి ఒక పావుగంట ప్రయాణించిన తరువాత ఒక నదిని దాటాం. చంద్రమౌళిగారు కలుగజేసుకానీ, పళ్మన కనిపిస్తున్న [గ్రామం

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

వెంగళాపురమని, ఇది పాలేటిగంగ(నది అని చెప్పారు. పాలేటిగంగమ్మ దాటుతుండగా కాటమరాజుకథ మదిలో మెదిలింది. కాటమరాజు తన ఆలమందను 12 ఏళ్లపాటు శ్రీశైలంలో మేపింతర్వాత, శివుని ఆజ్ఞపై కాటమరాజు దక్షిణం వైపు వెళ్లగా-కరువువల్ల నీరు, గడ్డి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాటమరాజు ఆలమందవ చాలా పెద్దది. అతనీ పశుసంపదను గురించి కాటమరాజు కథలో “కుదురు ఆరామడ కదులు పన్నెందామడనే” సామెతకు కారణమైందని చెప్పబడింది. బలిజ వారి సలహా మేరకు నల్లసిద్ధిరాజ్యానీకి మందను మళ్లిద్దామనుకొనీ పినతల్లి సిరిదేవికి చెప్పగా, వద్దని వారిస్తుంది. వినకుండా కాటమరాజు, తన వారితో కలిసి ఆలమందను పాలేటివాగు దగ్గరకు తోలుకొస్తాడు. గంగను దాటాలనుకుంటున్న కాటమరాజుతో గంగ తనను చేతులెత్తి మొక్కితేనే దాటనిస్తానంటుంది. ఇష్టపడని కాటమరాజు వాదోపవాదాల తరువాత, నమస్మరించగా, అంగీకరించిన గంగ, ఎండిపోయిన వాగులో నీటినీ రప్పించింది. కాటమరాజు తన ఆలమందతో పాలేటినీ దాటి నెల్లూరు సీమకు బయలుదేరి వెళ్ళిన సంఘటన గుర్తుకొచ్చింది. అలా నెమరు వేసుకుంటుందగా, వెంగళాపురంలోనున్న కాటమరాజు కథకు సంబంధమున్న అయితమరాజు విగ్రహం, పాలేటి గంగమ్మ అనీ పిలుస్తున్న మహిషాసురమర్దిని విగ్రహం దాని తరువాత అలవలపాడులోని వాగు ఒద్దునున్న ఒక బండపై గల క్రీ.శ 1526 వ సం[॥॥నాటి రాపురి రాఘవరెడ్డి, తన తండ్రి బస్పరెడ్డి, తల్లి అమలాంభీకకు పుణ్యంగా లింగాలకొండ సోమేశ్వరునికి, బంగాది గంగ (పాలేటిగంగుకు కొండమరుసయ్యగారు ఇచ్చిన నాయంకరంలోని కనిగిరి పోలచెర్ల, ముసుందూరి సీమలోని గంగపట్నాన్ని షోడశోపచారాలకు ఇచ్చినట్లు పేర్కొంటున్న శాసనాక్షరాల్ని తడిమి చూచాం.

ఇంతలో, కరుణానిధి, మమ్మల్ని పంచలింగాల కొండవైపు మళ్లించాడు. వపంచలింగాలకొందడ కూడా కాటమరాజుకు