పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొర్రయ్య మరణం మెకంజీని కలచివేసింది. మద్రాసు సముద్ర తీరంలో బొర్రయ్య అంత్యక్రియలు చేసిన ప్రదేశంలో ఒక శిలా ఫలకం వేయించాడు.

బొర్రయ్య మరణానంతరం లక్ష్మయ్యను మెకంజీ ప్రోత్సహించాడు 1815 నాటికి మెకంజీ భారతదేశానికి సర్వేయర్‌ జనరల్‌గా నియమితుడయ్యాడు. అనంతరం తనకు సహాయంగా ఉన్న లక్ష్మయ్యకు మద్రాసు పరిసరాల్లో ఉన్న ఒక గ్రామం ఈనాముగా యిచ్చి రెండు తరాలు దాకా అనుభవించే హక్కు ఏర్పాటు చేశాడు. 1811లోనే ఒక విల్లు రాస్తూ తన ఆస్టిలో పదోవంతు లక్ష్మయ్య కుటుంబానికి, అతని తమ్ముడయిన రామస్వామి కుటుంబానికి చెందే విధంగా రాశాడు తన దగ్గర పనిచేసిన కావలి సోదరుల కుటుంబాలకు జీవితకాలం ఏ లోటూ లేకుండా ఉండాలనే సత్సంకల్పం గల మెకంజీ ఔదార్యం తరతరాలకు మార్గదర్శకం.

మెకంజీ సేకరించిన సంకలనాలు అమూల్యమ్టైనవి, అవి వెలకట్టలేనవి. దేశ చరిత్రకు కావలసిన ఆకరాలు సమకూర్చిన కావలి సోదరుల కృషి భావితరాలకు తరగని సంపద. నిజానికి తొలి తెలుగు ఎపిగ్రఫిస్టు, అర్మియాలజిస్టు కావలి బొర్రయ్య అనే చెప్పాలి. భాషా పరంగా కొన్ని విషయాలు రేఖామాత్రంగా స్పృశించవలసిన అవసరం ఉంది.

లేఖన సంప్రదాయాలు

బొర్రయ్య ఆయన అనుచరులు సమకూర్చిన తెలుగు వృత్తాంతాల్లోని భాష ఆనాటి క్లిష్ట వ్యావహారికమనే చెప్పాలి. వీరి సేకరణలో ఆయా గ్రామాల్లోని వృద్ధులను, గ్రామాధికారులను, ఆయా కులాల పెద్దలను అడిగి సేకరించిన విషయాలతో పాటు తాళపత్ర గ్రంథాల్లొని వివరాలు ఆనాటి కైఫీయతులు. మెకంజీ సంకలనాలలో లేఖన సంప్రదాయాలు 7 విధాలుగా వర్గీకరించవచ్చు. ఆనాటి భాషలో తెలుగు శాసన భాష బాగా కనిపిస్తుంది.

1. పూర్ణబిందువు: పూర్ణభిందువు తర్వాత అక్షరం ద్విత్వం కావడం మెకంజీ సంకలనాల్లో ఉంది. ఉదా: మహారాజులుంగ్గారు (మెకంజీ సంపుటి 398 పుట 2) మచ్చలిబంద్దరిలో (మెకంజీ సంపుటి 47 పుట 33) ద్విత్వ లేఖనానికి మారుగా బిందువు రాయడం ఉదా: ఇంణి దరబారుకు పిలిపించి - మెకంజీ సంపుటి 80 పుట 105. కొన్ని సందర్భాల్లో నిర్దేతుకంగా పూర్ణ బిందువు రాయడం కూడా కనిపిస్తుంది. ఇది శాసన భాషలో కూడా కనిపిస్తోంది. శేరు సాహెబు ఆంమ్లీలో - మెకంజీ సంపుటి 45 పుట 43 ఆంలిస్తూన్నే- మెకంజీ సంపుటి 244 పుట 78

2 శాసన భాషలో రేఫకు బదులుగా వలవల గిలక రాయడం కనిపిన్తుంది. ఇది 1970 ప్రాంతం వరకూ ఉన్న ప్రామిసరీ నోట్లలోనూ, ఆస్థి మొదలయిన రిజిస్టేషన్‌ పట్టాల్లోనూ కనిపిస్తుంది. ఉదా: బలగ ౯ వ్వం బొప్పంగ - పండరంగనీ అద్దంకి శాసనం 770 ప్రాంతం. దర్వాజాకు తూప్పు ౯ లోతటుట మెకంజీ సంపుటి 272 పుట 6 వెంకట నరసింహ్వు శాస్తుల్ల ౯ తంముడు - మెకంజీ సంపుటి 104 పుట 1 వలపలగిలకకు పూర్వముందున్న అక్షరం ద్విత్వం పొందని రూపాలు కూడా కొన్ని ఉన్నాయి. కూచి ౯, ఖచు ౯ మొదలయినవి.

3. పదమధ్యంలోపించి సంయుక్తత ఏర్పడం దస్తావేజుల్లోనూ ఉందని సి.పి. బ్రౌన్‌ A Dictionary of the mixed dialects and foreign words used in Telugu పుట 31లో పేర్కొన్నాడు. - మ్లేచ్చా క్రాంతములయినంద్ను మెకంజీ సంపుటి 28 పుట 9 - మొదలయ్న వారితో మెకంజీ సంపుటి 113 పుట 102 ఇంకా వలశ్ని, కన్కు త్నఖా వెుదలయినవి.

4. బుకారానికి బదులు ఇత్వ సహిత రేఫ ప్రాచీనకాలంలో కనిపించే సంప్రదాయం. ఇదే మెకంజీ సంపుటాల్లో కూడా కనిపిస్తుంది.

కృిష్ణాజీ పంతులు వారి తాకీదు - మెకంజీ సంపుటి 105 పుట 158ప్రెత్తులుగా యేర్చరచినారు మెకంజీ సంపుటి 1 పుట 132

5. సంక్షేమ లిపి C contraction of the Script లేఖన సౌలభ్యం కోసం ఒక పదంలోని తొలి అక్షరాన్ని పదానికి మారుగా వాడటం నాటికీ నేటికీ ఉన్న సంప్రదాయం. కు॥ కుచ్చెళ్ళు - యెనిమిది కుచ్చెళ్ళున్నర మెకంజీ సంపుటి 1 పుట 74 భ॥ భరణము - భ 1కి అయిదు చవుతుల చొప్పున - మెకంజీ సంపుటి 20 పుట 4 అలాగే రూ॥ రూపాయి, శా॥ శాలివాహన చొ॥ చొప్పున తా॥ తారీఖుకు మొదలయినవి.

6. హ్రస్వం రాయవలసిన చోట దీర్ఘం రాయటం, దీర్ఘం రాయవలసిన చోట హ్రస్వం రాయటం విర్ని = వీరిని, విర్ని అందర్ని- మెకంజీ సంపుటి 93 పుట 61 బురూజు = బురుజు, బురూజు - మెకంజీ సంపుటి 80 పుట 93

7. గహ్వర, జిహ్వ మొదలయిన పదాలు రాసేటప్పుడు గంహ్వర, జింహ్వ అని రాయడం ఆనాటి కాలంలో ఉంది. నరసింహ్వ - మొదలుగునవి. - మహారాఘ్ల్రల ప్రభావం ఆంధ్రదేశం పై ఉన్న దనడానికి కొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు.

శివాజి పరిపాలనా కాలంలో పన్ను వసూలు చేసే పద్దతిని చౌతు అనేవారు. అది ఆంధ్ర ప్రాంతంలో మనకు మహారాష్ట్ర నుంచి వచ్చిన పదం అని నిర్ధారణ. తెలుగు సీమలో రెడ్డి, కరణం, వెట్టి, తలారి మొదలయిన పన్నెండుమంది గ్రామోద్యోగుల్ని “బారాబలూతి” అని వ్యవహరించే సంప్రదాయం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన పదం.

తెలుగు వారిలో కొందరి పేర్ల చివర రావు, పంతులు, అనే బిరుదు నామాలు మరాఠి సంప్రదాయ కరణమే. ఇవన్నీ మెకంజీ సంపుటాల్లో ఉన్నాయి. ఆరె మరాఠీలు - తెలుగు వారిపై ఉన్న భాషా ప్రభావాన్ని ఆచార్య పేర్వారం జగన్నాధం గారు వివరించారు. మెకంజీ సంకలనాల్లో ఉరుదూ, మరాఠీ, ఒరియా పదాలు గుర్తించి వివరించిన డాక్టర్‌ రాళ్ళబండి శ్రీరామశాస్త్రి, ఆచార్య దొణప్ప గారి పర్యవేక్షణలో పిహెచ్‌.డి. డిగ్రీ పొందిన వ్యాసంలో కూడా కొన్ని వివరాలు కన్పిస్తాయి.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

34