పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధారావాహిక

ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 98481 23655


పడమటి గాలితో నివురు తొలగిన

తెలుగు భాషా సాహిత్య సంపద

భారతదేశం అనాదిగా సహజ జల సంపద, అటవీ సంపద, భూగర్భంలో దాగిన ఖనిజ సంపద మొదలయినవి పుష్కలంగా ఉన్న సంపన్న వనరులున్న నేల మనది. మన పూర్వికులు ఒక మాట అనేవారు. మనదేశంలో భూమిపైన ఎంత సంపద ఉందో దానికి వేలరెట్లు భూమిలో కోటానుకోట్ల సంవత్సరాల వరకూ నిక్షిప్తమైన తరగని సంపద ఉంది అనేవారు. అందుకేనేమో మన దేశం పైన ప్రపంచ దేశాలు దండెత్తి సహజ సంపదను యధోచితంగా దోచుకున్నారు. నిజానికి ఒకనాటి రోజుల్లో భారత దేశమంతా చిన్నిచిన్ని రాజ్యాలుగా సుభాలుగా, పరగణాలుగా, ప్రాంతాలుగా విభక్తమయి ఉండేది. బలవంతుడయిన రాజుకు చిన్నిచిన్ని రాజ్యాలు కప్పంకడుతూ జీవించేవాళ్ళు. క్రీస్తుపూర్వం రాజ్యం చేసిన చక్రవర్తులు, రాజులయిన అశోకుడు, చంద్రగుప్తమౌర్యుడు సముద్ర గుప్తుడు, బిందుసార, పుష్యమిత్ర శుంగుడు లాంటివాళ్ళు క్రీస్తుపూర్వం నాటి వాళ్ళు. క్రీస్తుశకంలో మహేంద్రవర్మ, స్కాందగుప్త, దంటిదుర్గ, శిముఖ, సింహ, విష్ణుగుప్త, చాళుక్య, శీకృష్ణదేవరాయ మొదలయిన రాజులెందరో పరిపాలించారన్నది చారిత్రక సత్యం.

ఈ నేపథ్యంలో భారతదేశంపై దండెత్తి మనపై రాజ్యం చేసిన తురుష్కులు, మహమ్మదీయులు, అరబ్బులు, మంగోలులు పాశ్చాత్య దేశాలయిన పోర్చుగీస్‌, డచ్‌, ఫ్రెంచ్ ఇంగ్లండ్‌ మొదలయిన ఈస్టిండియా కంపెనీలు భారతదేశాన్ని ఆక్రమించి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తూ మనగడ్డపై మనలను కూలీలుగా, బానిసలుగా, సేవకులుగా చేశారన్నది స్తవము కాని వాస్తవం. భారతదేశ సహజ సిద్దమైన సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపుటలవాట్లు, పండుగలు, వినోదాలు, ఆటపాటలు, వస్త్రధారణ, భాషలో ఆదాన ప్రదానాలు వెుదలయినవన్నీ మనదేశీయ సంస్కృతిలో, సంప్రదాయాల్లో కలిసిపోయాయి. పాలకుల ప్రభావం పాలితులమీద ఉంటుందన్నమాట అక్షరాక్షరసత్యం. అన్ని రకాల ఆటుపోట్ల మధ్య మనకంటూ మిగిలిన సంస్కృతి, సంప్రదాయలు, చరిత్ర ఏదీ గ్రంథస్తం కాలేదు. దీనికిగాను కాళ్ళకు బలపాలు కట్టుకొని శ్రమించిన కల్నల్‌ కాలిన్‌ మెకంజీ (1754-1821) లాంటి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన కావలి వెంకట బొర్రయ్య, కావలి వెంకట లక్ష్మయ్య, రామస్వామిల సహకారం మరువలేనిది. వీరిని కావలి సోదరులు అనేవారు. వీరిలో బొర్రయ్య జీవించింది 27 సంత్సరాలే అయినా (1776-1803) ఆంధ్రదేశం మాత్రమే కాకుండా భారత దేశమంతా బుణపడేటంత కృషి చేసి తరగని చారిత్రిక విషయ విజ్ఞాన సంపద మనకు అందించాడు.

కావలి వెంకట సుబ్బయ్య రెండో కుమారుడు కావలి వేంకట బొర్రయ్య పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసి 1776లో జన్మించారు. సగ్రామంలోని వీధిబడిలోనే విద్యాబ్యాసం ప్రారంభమయింది. పన్నెండేళ్ళు వచ్చేసరికి సంస్కృత కావ్యాలు అధ్యయనం చేయడంతోపాటు స్వంతగా సంస్కృత శ్లోకాలు అల్లడం నేర్చుకున్నాడు. సంస్కృతంతోపాటు ఉర్దూ తెలుగు నేర్చుకున్నాడు. పద్నాలుగో ఏట ఏలూరుకు తూర్పుగా ఉన్న కొత్తూరు జాగీర్‌దార్‌గారి కాజీగారి దగ్గర పారశీక, హిందూస్తానీ భాషలు నేర్చుకున్నాడు. బొర్రయ్య కున్న చురుకుదనం, అపారమేధాసంపత్తిని గుర్తించిన కాజీగారు ఆప్యాయంగా, ఆనందంగా అమిత శ్రద్దతో భాషల అధ్యయనంపై ఆసక్తిని కలిగించాడు.

బొర్రయ్యకు పద్నాలుగు ఏళ్ళు వచ్చేసరికి బందరులో మోర్గాన్‌ దొర నేతృత్వంలో ఉన్న ఇంగ్లీషు బడిలో అతికొద్దికాలంలోనే ఇంగ్లీషు చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకున్నాడు. బొర్రయ్యకున్న ప్రావీణ్యం శ్రద్దను గమనించిన దొరలు కూడా బాగా ప్రోత్సహించారు. దీనికి తోడు బొర్రయ్య అన్న నారాయణప్ప, అప్పటికే కుంఫిణీ కొలువులో ఉద్యోగిగా ఉన్నాడు. నారాయణప్ప నమ్మకం గల సేవకుడిగా పేరుంది. అన్న నారాయణప్ప వినయం, విధేయత, విశ్వాసం, నమ్మకంగల కుంఫిణీ ఉద్యోగి అయినందువల్ల అన్నలాగే కుంఫిణీ ఉద్యోగం సంపాదించాలనే కోరిక కూడా బొొర్రయ్యకు ఉంది "పైగా ఆరోజుల్లో కుంఫిణీ ఉద్యోగి అంటే సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలుండేవి. అది గొప్ప హోదాగా భావించేవారు. అన్నగారి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న బొర్రయ్య అంటే పైఅధికారులకు, అనాటి దొరలకు మంచి అభిప్రాయం ఉండేది. దేశీయ పటాలానికి అధికారిగా ఉన్న కర్నల్‌ పియర్స్‌ దొరకు బొర్రయ్య అభిమాన పాాత్రుడయ్యాడు. అందునా బహుభాషాప్రావీణ్యం ఉన్నందువల్ల పియర్స్‌ దొర ప్రోత్సాహం బొర్రయ్యకు లభించింది. పియర్స్‌ దొర సిఫారసుతోనే బొర్రయ్యకు బందరు పే మాస్టర్‌ కచేరిలో ఉమేదువారిగా చేరే అవకాశం కలిగింది. ఉమేదువారీ అంటే జీతంలేని తాత్కాలిక గుమాస్తా అని అనేవారు. ఇది ఒక రకంగా ఉద్యోగిగా చేరడానికి ముందు పనినేర్చుకునే విధానం. వారి ప్రవర్తన పనిని బట్టి ఉద్యోగం లభిస్తుంది. నేర్చుకునేకాలంలో వారి పనిసామర్థ్యం బట్టి కొద్ది జీతంతో మొదలయి పెద్దపెద్ద పదవుల వరకూ వెళ్ళగలిగేవారు. బొర్రయ్యసహజంగా నమ్మకస్తుడిగా, వినయ వివేకశీలిగా ఉన్నందువల్ల అనతి కాలంలోనే మంచి జీతానికి కుదిరాడు. రైటరు ఉద్యోగంలో చేరడం అంటే ఆరోజుల్లో గొప్ప ఉద్యోగమే. ఉద్యోగంలో ఆనుపానులన్నీ కరతలామలకం చేసుకున్నాడు. అది బొర్రయ్య భావి జీవితానికి ఎంతో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

32