నేను దీనికి ఇస్తున్న అర్ధం - మజణింత పదార్ధాన్ని సామగగ్రినీ మీద పేర్చి బలోపేతం చేయడం 10 19010106.
ఈ అధ్యాయంలోని సూచనల్ని అనుసరించి ఈ క్రింద ఇచ్చిన అచ్చతెలుగు నామవాచకాల్ని క్రియాధాతువులుగా మార్చి మీరు అనుకుంటున్న అర్ధాన్ని జోడించండి :
1.అది = అధికము, వ్యర్థము 2. అనీ = యుద్ధము 3. అబ్బ = తండ్రి & అబ్బీ = మనిషి (మగవాడు) 5. అణ = సగము 6. అరి = పన్ను 7. అజ్జ = ముసలి ఆవు 8. అల = చిజఖుకెణటం 9. అల్ల = మందము 10. అవ్వ = తాతభార్య 11. ఇడి = సేమియా 12. ఇట్టి = మగజింక 13. ఇల్లి = ఉపవాసము 14. ఉడ్డ = రాశి 15. ఉట్టి = కప్పుకు వేలాడదీసిన పాలకుండ మొ॥ 16. ఉల్లి = ఒక శాకము 17. ఉరి = ఉద్బంధనము 18. ఉమ్మ = అవిరి 19.ఉలి = శిల్పాలు చెక్కే పనిముట్టు 20. ఎడ = చోటు, అంతరం, మనస్సు, హృదయం, సమయం 21. ఎద = మనస్సు,హృదయం
22. ఎన = సాటి, సమం 23. ఎమ్ము = ఎముక 24. ఎర = బలి, ఆహారము 25. ఎల = లేత, యౌవనములోని 26. ఎల్ల = అన్నీ 27. ఎస = మిక్కిలి 28 ఒగి = వరుస, క్రమము 29. ఒజ్జ్ఞ = గురువు 30. ఒర = కత్తిని ఉంచే కోశం. 31. బరి = ప్రక్మన 32. గటి = అక్క 33.అల = చిజలుకెజటం 34. ఆన = ఒట్టు 35. బాన = గుంద్రనీ కాగు 36. వాన = వర్షం 37. జేన (జాన) = వయోజనుల (20019) అరిచేతినీ పూర్తిగా చాపినప్పుడు బొటనవేలి కొస నుంచి మధ్యవేలి కొస దాకా వచ్చే పొడవు ౩8 చెల = బంధనం 39. అర
కొయ్యసామ[గిలోని గడి 40. మర = యంత్రం 41. వల
చేపలుపట్టడానికి వాడే అల్లికపని 42. కడ = అంతం 43. వడ = మినప్పప్పుతో చేసే ఒక భక్ష్యం 44 తెగ = ఉపజాతి 45. నగ = ఆభరణం 45. పగ = ప్రతీకారవాంఛ 46. గది = ఇంటిలో ఒక ఖాగం 47. రొద = రణగొణధ్వని 4ఉ8 పొద (పొదరు) = మొక్కల గుబురు. 49. చెద = తెల్ల పురుగుల గూళ్ళు 50. వెల= మూల్యం
జా
శ్రద్దాంజలి
ముల థి
అమ్మకు విషవ వందనాలు
ప్రభలకుమారికి కుమార్తె బీనాదేవి కన్నీటి వీడ్కోలు
తిరుపతి మావోగా ప్రసిద్ది పొందిన త్రిపురనేని మధుసూదనరావు సతీమణి(79) ఈ జనవరి 13న
తీవ అనారోగ్యానికి గురై మరణించడం బాధాకరం. ఆమెకు కొడుకు విజయకుమార్ కుమార్తె బీనాదేవి వున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని నందివాదకు చెందిన ప్రభలకుమారి త్రిపురనేని జీవిత సహచారిగా ఆయన విప్లవ సాహిత్య రాజకీయ అడుగు జాడల్లో నడిచారు. ఎమర్షైన్సీ సమయంలోనూ, చిత్తూరు, సికింద్రాబాదు కుట్రకేసుల్లో త్రిపురనేని అరెస్టు అయి లెక్చరర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయినప్పుడూ, ఇతర నిర్భంధ సమయాల్లోనూ ఆమె ఎన్నో కష్టాలు, బాధలు భరించారు. ఎన్నడూ థైర్యం కోల్పోలేదు. పశ్చాత్తాపం చెందలేదు. పిల్లల భవిష్కత్తును భర్త పట్టించుకోకున్నా కుటుంబం ఎంతో- విష్ణ్లవమూ అంతే అని నమ్మింది. ఆమె ఉద్యమంలో చేసే విద్యార్దులు, రచయితలు ఆమెకెంతో ప్రీతిపాత్రులు. వాళ్ళ బాగోగులు, ఉద్యమకార్యక్రమాల గురించి మాతో వెళ్ళినప్పుడంతా మాట్లాడేది ప్రభలకుమారి. సాధారణ గృహిణేకాదు
అసాధారణ మహిళ కూదా. సంప్రదాయం ఆచారాలకు భిన్నంగా తిరుపతి గోవిందధామంలో ఆమె
అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ త్రిపురనేని కుటుంబంతో తనకు విడదీయరాని అనుబంధం వుందని గుర్తుచేసుకున్నారు. ప్రభలకుమారి భౌతికకాయంపై చంద్రశేఖర్, జ్యోతి, శ్రీరాములు ఎర్రజెండా కప్పి వివాళి అర్చించారు. దహనపేటిక మీద అమ్మను చూస్తూ బీనాదేవి 'మా అమ్మ లేకుండా మా నాన్న లేరు. అమ్మా నన్ను కన్నందుకు విష్లవాఖినందనాలు" అని కన్నీళ్ళతో వీడ్మోబు పలికారు. -సాకం నాగరాజు
కీకు వాకిట... కథా నిలయం 'కారాబాటలో “అరా”!
మంచి పనుల్ని కొంతమంది మంచివాళ్ళు అందిపుచ్చుకుంటారు. అలాంటి మంచివాళ్ళలో జనవరి 31న కన్నుమూసిన అప్బీగారు రాజేంద్రప్రసాద్ ఒకరు. కారా మాస్టారు “కథానిలయం” స్థాపించారనీ చాలా మందికి తెలుసు. అలా తెలుసుకున్న అప్ప్బిగారి రాజేంద్రప్రసాద్(అరా) ఓ కథానీలయాన్నీ నందలూరులో స్థాపించి అందులో వేలాది పుస్తకాలను సేకరించి పెట్టారు. కానీ కాళీపట్నం కథానీలయంతో అబ్బీగారి కథానిలయానికి పోలిక తగని కార్యం. కథానిలయం పేరు - ఓ ముచ్చట అవ్బీగారికి. ఆ 'పేకుమీద 15 సం॥రాల పాటు కవుల జయంతులు, వర్థంతులు, పుస్తక ఆవిష్కరణలు, రచయితల సత్కారాలు, ఆవిష్మరణలు,.... లెక్కేలేదు. విద్యార్థి దశలో వామపక్షభావవైతన్యం, కదప ఆర్ట్స్ కళాశాల విద్యార్ధి సంఘం చైర్మన్ పదవి రాజేంద్రకు పేరు తెచ్చిపెట్టింది. ఎదుటి మనిషిని పలకరించడంలో ఆత్మీయత గుబాళించడం ఇంకో గొప్పదనం. పుస్తకాన్ని రచయితను నెత్తిన పెట్టుకాని ఊరేగిన వ్యక్తిగా గుర్తింపు ఫొందిన ధన్వజీవి అ.రా. 1962 జూన్ 15న పుట్టిన రాజేంద్రప్రసాద్ అరవై ఏళ్లలోపే కనుమరుగు కావటం సమాజంలో ఎంతో లోటును మిగిల్సింది. -సాకం నాగరాజు
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఈ మార్చి-2021 | పగ,