పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారసత్వ సంపద

డా౹౹ పి, శివరామకృష్ణ 'శక్తి ' 94414 27977


'పొలవరం ' కింద మునిగిపొతున్న తెలుగుజాతి కీర్తి గుర్తులు

గతవైభనం పేరిట, దేవుళ్ళ పేరిట, కులాల పేరిట కొట్టుకుంటున్న వర్గాలు ఈ చారిత్రక సంపదను భద్రపరచుకోకపోతే -భావితరాలు చరిత్రహీనులైపోతారు. పోలవరం ప్రాజెక్టుకు గేట్లు బిగింపు, నిర్వాసితుల తరలింపు జరుగుతున్నంత వేగంగా ఈ శిధిలాల సేకరణ, మ్యూజియం నిర్మాణం, దేవాలయాల పునఃప్రతిష్ట కూడా జరగాలి.

1323 కాకతీయ సామ్రాజ్యం అస్తమించాక వారి సేనాధిపతులలో ముసునూరి ప్రోలయ, సింగమనాయకులు, వేమారెడ్డి స్వతంత్ర రాజ్యస్థాపనకు పూనుకున్నారు. పోలయ తరువాత అతని పినతండ్రికొడుకు కాపయ రాజైనాడు. వీరందరూ ఏకమై 1336లో ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నారు. పోలవరం కాపవరం గ్రామనామాలు వీరి పేరిటివే.

పోలయ కాపయలు మాల్యవంతం అంటే పాపికొండలలోని నేటి వరరామచంద్రపురం మండలంలోని రేకవల్లి రాజధానిగా ఆంద్రదేశాధీశ్వర బిరుదంతో గద్దె నెక్కారు. వారి ఇష్టదైవం శ్రీరామగిరిలోని సుందరరాముడు. గిరిజన సంప్రదాయ ప్రకారం ఈ రాముడికి దొంగపెళ్ళి చేసిన తరువాతనే భద్రాచలంలో కళ్యాణం చేస్తారు. ఈ ప్రాంతం ఒకనాడు రుద్రమదేవి వేటలభూమిగా రుద్రమకోట అని జనం చెప్పుకుంటారు.

కాపయనాయకుడు తూర్పుగోదావరిలో కోరుకొండ పక్మన శ్రీరంగపట్నం రాజధానిగా పాలిస్తున్న ముప్పయ నాయకునకు తన సోదరినిచ్చి పెళ్లి చేసాడు. దేవీపట్నం పక్మనగల తొయ్యేరులో తన ప్రతినిధిగా అనపోతనాయకుని నియమించాడు. క్రమంగా ఈ ప్రాంతంగజపతులపాలై వారి కొన్ని గ్రామాలకు వారిపేర్లు పురుషోత్తమపట్నం, రఘుదేవపురం వచ్చాయి. పోలవరం రాజమహేంద్రి రెడ్డిరాజుల 'రెడ్దిపోలవరం ' అయింది. పోలవరం కింద పట్టిసీమ పైన మునిగిపోనున్న మహానందీశ్వరం వారి ప్రాభవాన్ని చాటుతాయి. 'పావనంబైన తమిలేటి పరిసరమున వేగి కురువాటికా దేశవిపినభూమి' అని ఈ అడవులను శ్రీనాధ మహాకవి వర్ణిస్తాడు. బస్తర్‌లో మద్దేటి రాయభూపాలపట్నం పాలకులు గోదావరిమీదుగా వలస వచ్చి రంప, కొత్తపల్లి పోలవరం, లక్ష్మీనారాయణదేవ్‌ పేట, మంగవతి దేవ్‌ పేటలలో వారి సామంతులుగా. స్థిరపడ్డ క్రమాన్ని రెడ్డిరాజులు “దండకారణ్య మధ్య రంభాహి వంశజులకు అభయమొసగి” నారని మవోకవి వర్ణిస్తాడు. స్టానిక పాలకులు ముఠాదార్లు, ఈ పాలకులు వారిని సమర్ధించిన తెల్లవాళ్ళతో తలపడిన సుదీర్ఘి పోరాటమే రంపపితూరి.. పాపికొండలలో కొరుటూరు సుబ్బారెడ్డి నానాసాహెబ్‌ పిలుపు మేరకు ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నానని రాజమండ్రి కోర్టులో మరణ వాంగ్మూలమిచ్చి ఉరికంబమెక్కాడు. రేకపల్లిలో కొండ్లభీమిరెడ్డి రంపపితూరి నాయకులలో ఒకరు. ముసునూరి నాయకులలో ఒకరు కూనయనాయకుని పేరిటి కూనవరంలో గల ఒకనాటి పోలిస్‌ స్టేషన్‌ చారిత్రాత్మకమ్హైనది. కొచ్చెర్లకోట వారు వేలంలో పోలవరం కొనుక్కున్నారు.

నైజాం రాజ్యంలోని పేరంటపల్లిలో ఎక్కడినుంచో వచ్చిన స్వామి బాలానంద, రామకృష్ణ మునివాటం నిర్మించుకొని గిరిజనాభివృద్ధికి కృషి చేసారు. తొలితరం లోకసభ, శాసనసభ మహిళాసభ్యులు రాధాబాయి ఆనందరావు, వాణిరమణరావు ఆయన చదివించిన వారే. ఈ ప్రాంతంలో ప్రఖ్యాత మానవశాస్త్రవేత్త హైమెండర్భ్‌ దంపతులు ఇక్కడి కొండరెడ్డితెగ మీద పరిశోధన చేసి. ది రెడ్డీస్‌ ఆఫ్‌ బైసన్‌ హిల్స్‌అనే పెద్ద గ్రంథాన్ని రాసారు. కొాందమొదలు ముఠాదారు లింగారెడ్డి నుండి నాటి కంపెనీ ప్రభుత్వం అతను వసూలు చేసుకునే గోదావరి రవాణా సుంకానికి 50రు. పరిహారమిచ్చి కొనుక్కున్నది. సర్‌ అర్ధర్‌ కాటన్‌, నేటి ఛత్తీస్‌ఘర్‌లోని కుంటలో కట్టకట్టి సంవత్సరం పొడుగునా గోదావరినది మీదుగా రవాణా సౌకర్యం కల్పించాడు. జానపద వాంగ్మయోద్దారకుడు నేదునూరి గంగాధరం రాజమహేంద్రిలో గుండువారి రేవు నుండి పర్ణశాల దాకా భక్తుల శ్రీరామనవమి లాంచీ ప్రయాణం వివరంగా వర్ణిస్తారు. బాపు “అందాల రాముడు నుంచి శేఖర్‌ కమ్ముల “గోదావరి " దాకా ఈ పోలవరం ముంపు ప్రాంతంలో ఎన్నో సినిమాలు తీసారు. కాని ఈ చరిత్ర నెవరూ పరోక్షంగానైనా ప్రస్తావించలేదు... దశాబ్దం పైగా లాంచీ సౌకర్యం ముమ్మరమై యాత్రికులు ఎడతెరపి లేకుండా ఈ గోదావరిలో విహరిస్తున్నారు.

ముంపుప్రాంతం - మ్యూజియం

2017లోనే ఈ ముంపు ప్రాంతంలో 28 ప్రదేశాలలో గల చారిత్రక సంపదను తరలించి ఒక మ్యూజియంలో పెట్టాలని ప్రభుత్వం

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

27